విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

Published Mon, Oct 5 2015 1:02 PM

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయనగరం జిల్లా భోగాపురం వెళతారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్‌ పర్యటిస్తున్నారు. ఎ.రావివలస రిలేనిరాహార దీక్ష శిబిరం వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడతారు. అనంతరం గూడెపువలస గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కవులవాడ గ్రామానికి చేరుకుని అక్కడ బాధితులతో మాట్లాడుతారు.  

 

Advertisement
Advertisement