ప్రధాని పదవిపై మోడీకి మక్కువ ఎక్కువ: దిగ్విజయ్ | Sakshi
Sakshi News home page

ప్రధాని పదవిపై మోడీకి మక్కువ ఎక్కువ: దిగ్విజయ్

Published Tue, Jan 21 2014 3:45 AM

ప్రధాని పదవిపై మోడీకి మక్కువ ఎక్కువ: దిగ్విజయ్ - Sakshi

భోపాల్: ప్రధాని పీఠంపై కన్నేసినవారిలో గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ముందంజలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్‌తో పాటు చాలామంది ప్రధాని కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

తమిళనాడు సీఎం జయలలిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ జాబితాలో ఉన్నారన్న దిగ్విజయ్.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మాత్రం అందులో లేరన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మాత్రమే రాహుల్ నాయకత్వం వహిస్తారని  దిగ్విజయ్ పేర్కొన్నారు. రాహుల్ రాజకీయ జీవితాన్ని త్యాగం చేయడం ఇష్టం లేకనే ఆయన్ను ప్రధాని అభ్యర్థిత్వానికి సోనియూగాంధీ దూరంగా ఉంచారనే మోడీ విమర్శను ఖండించారు. తల్లి ప్రేమను మోడీ ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్నారు. మోడీ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ పార్టీ సహచరుడు మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దిగ్విజయ్ విభేదించారు.
 

Advertisement
Advertisement