- ప్రఖ్యాత మీడియా గ్రూప్ అధినేత కరీమియాన్ దారుణ హత్య
- టీవీ ప్రసారాలపై మత సంస్థల హెచ్చరికలు..
- కుట్రపై కుటుంబీకుల అనుమానం.. డబ్బుల కోసమేనన్న పోలీసులు
ఇస్తాంబుల్: ప్రఖ్యాత జెమ్ మీడియా గ్రూప్ అధినేత సయీద్ కరీమియాన్(45) దారుణ హత్యకు గురయ్యారు. వ్యాపార భాగస్వామితో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు వెంటాడిమరీ హతమార్చారు. ఇస్తాంబుల్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన టర్కీ, ఇరాన్లను ఉలిక్కిపడేలా చేశాయి. దీనికి సంబంధించిన వివరాలను టర్కీ పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు.
కారులో ప్రయాణిస్తున్న కరీమియాన్ను.. వేరొక వాహనంలో దుండగులు వెంబడించారని, మస్లాక్ కూడలిలో జీపును అడ్డంగా నిలిపి కరీమియాన్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కరీమియాన్ అక్కడికక్కడే మరణించగా, కారులో ఉన్న అతని కువైతీ భాగస్వామి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడని వివరించారు. ఆర్థిక వివాదాల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
జెన్ టీవీ.. ఇరాన్లో ఓ సంచలనం: లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే జెన్ టీవీ ఇరాన్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు! దశలవారిగా పారశీ భాషలో 17 చానెళ్లు, కుర్దూ, అరబిక్, అజెరీ భాషల్లో ఒక్కో టీవీ చానెళ్లు ప్రారంభించిన కరీమియాన్.. వాటిలో ఎక్కువగా పాశ్చత్య కార్యక్రమాలనే ప్రసారం చేసేవారు. విదేశీయుల ఫ్యాషన్ షోలు, పార్టీ కల్చర్స్, సినిమా సంబంధిత వార్తలను పార్శీలోకి తర్జుమా చేసి ప్రసారం చేసేవారు. షరియత్ చట్టాలు కఠినంగా అమలయ్యే ఇరాన్లో ఈ తరహా ప్రసారాలపై స్థానిక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. టీవీ ప్రసారాల ద్వారా ప్రజల్ని చెడగొడుతున్నాడనే నేరం కింద జెన్ టీవీ అధినేత కరీమియాన్కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ టెహ్రాన్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
హత్యకు వినియోగించిన వాహనం దహనం: కొంత కాలంగా ఇస్తాంబుల్లో ఉంటోన్న కరీమియాన్ను పలు మత సంస్థలు తీవ్రంగా హెచ్చరించాయని, దీంతో ఆయన మకాంను లండన్కు మార్చాలనుకున్నారని, ఇంతలోనే దారుణం జరిగిపోయిందని కరీమియాన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇకపోతే, కరీమియాన్ను హత్య చేసే క్రమంలో దుండగులు వినియోగించిన వాహనం.. దహనమైన స్థితిలో గుర్తించినట్లు టర్కీ పోలీసులు చెప్పారు. ఆనవాళ్లు చిక్కూడదనే హంతకులు ఇలా చేసిఉంటారన్న పోలీసులు.. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
టీవీ చానళ్లలో ఆ ప్రసారాలే ప్రాణం తీశాయా?
Published Mon, May 1 2017 3:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement