నిజామాబాద్ జిల్లా పోతాయిపల్లి గ్రామస్తుల తీర్మానం
లింగంపేట: విద్యార్థులు బడికి వెళ్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానం చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లిలో చోటు చేసుకుంది. పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో విజయ్కుమార్ అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. పాఠశాలలో 220 మంది విద్యార్థులున్నారు. ఆ గ్రామం పొరుగున ఉన్న కోమట్పల్లి ప్రాథమిక పాఠశాలలో 92 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు.
ఉపాధ్యాయులు తక్కువగా ఉండడం తో అధికారులు విజయ్కుమార్ అనే ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై కోమట్పల్లి పాఠశాలకు పంపారు. అయితే, ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఆ ఉపాధ్యాయుడి డిప్యుటేషన్ను అధి కారులు తొలగించి తిరిగి పోతాయిపల్లి స్కూల్కు పంపారు. ఆ ఉపాధ్యాయుడి డిప్యుటేషన్ రద్దుపై కోమట్పల్లి గ్రామస్తులు విద్యాశాఖ సిబ్బందిని నిలదీశారు. సదరు ఉపాధ్యాయుడిని కోమట్పల్లి ప్రాథమిక పాఠశాలకు పంపాలి.. లేదంటే మా గ్రామం నుంచి వచ్చే 120 మంది విద్యార్థులను పోతాయిపల్లికి పంపబోమని తీర్మానించుకున్నారు.
ఎవరైనా వెళితే రూ. ఐదు వేల జరిమానా విధించాలని తీర్మా నించారు. సదరు ఉపాధ్యాయుడు కోమట్పల్లి పాఠశాలలో విధులు నిర్వర్తించాలి, లేదంటే తమ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ స్కూల్లో బోధించడానికి వీలులేదని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కోమట్పల్లిలో 6 నుంచి 10వ తరగతి వరకు ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు వెళ్లడం లేదు.
పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో సగం మంది కోమట్పల్లి గ్రామస్తులే కావడం విశేషం. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్యను సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక్క ఉపాధ్యాయుడి కోసం దశాబ్దాలుగా కలిసి ఉన్న రెండు గ్రామాల్లో చిచ్చు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడికి వెళ్తే రూ.5 వేలు జరిమానా!
Published Fri, Aug 28 2015 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement