సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ(టీటీడీపీ) దుకాణం ఇక మూతపడినట్లే. పలువురు తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాలో టీడీపీ ప్రాబల్యం రోజురోజుకు తగ్గిపోగా.. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరీ చిక్కిశల్యమైంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా భవిష్యత్ ఉన్న పలువురు నేతలు ఆ పార్టీలో ఉంటే మనుగడ సాధించలేమన్న ఉద్దేశంతో మారుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ గరికపాటి మోహన్రావు, మాజీ ఎంపీ చాడ సురేష్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా భూపాలపల్లి, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల టీడీపీ అధ్యక్షులు, పలువురు నియోజకవర్గాల ఇన్చార్జ్లు ఆదివారం కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత సీనియర్లు ఒక్కరొక్కరుగా టీడీపీని వీడుతుండటంతో ఆ పార్టీలో చివరకు ఎవరు మిగులుతారన్న చర్చ మొదలైంది.
బాటలు వేసిన కడియం.. భారీ షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కడియం శ్రీహరి టీడీపీ నుంచి బయటపడ్డారు. 2013 మే 11న ఆ పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు వైఖరిపై విసిగి వేసారిన ఎర్రబెల్లి దయాకర్రావు టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 2015 జులై 21న టీఆర్ఎస్లో చేరారు. ఏకంగా ఆయన టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఆ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి టీడీపీ నుంచి ఇతర పార్టీలకు మొదలైన వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పుడు ఆయన వెంట ఉమ్మడి వరంగల్కు చెందిన సీనియర్ నాయకురాలు ధనసరి అనసూయ(సీతక్క), మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి నడిచారు. ఫలితంగా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి వరంగల్ వరుస వలసలతో దయనీయ పరిస్థితికి చేరుకుంటోంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఒక్క వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేసిన ఆ పార్టీ ఓటమి పాలైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో సరేసరి కాగా.. పంచాయతీరాజ్ ఎన్నికలతో పాటు పార్టీ రహితంగా జరిగిన గ్రా మ పంచాయతీల ఎన్నికలు.. ఇలా ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కనీసం ఉనికిని చాటలేకపోయింది.
పార్టీలో మిగిలిన సీనియర్ ప్రకాశ్రెడ్డి
నాయకుడు లేని నావలా తయారైన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నర్సంపేట నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆయన కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగినా.. స్పష్టత లేదు. అయితే, దీనిని ఆయన ప్రచారంగానే కొట్టిపారేస్తుండగా... పార్టీ సీనియర్గా ఆయనొక్కరే టీడీపీకి ఇప్పుడు పెద్దదిక్కుగా మిగిలినట్లయింది. ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్లో జరిగే బహిరంగసభలో పలువురు టీడీపీ సీనియర్లు పెద్ద సంఖ్యలో కాషాయ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిసింది. కాగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పుల్లూరు అశోక్కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ రఘునాథరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వారి అనుచరులతో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు వీరంతా కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేసి లేఖను అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలో ఆదివారం జరగనున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమక్షాన ఆ పార్టీలో చేరనున్నామని కూడా వారు ప్రకటించారు.
చివరకు మిగిలేది ?!
Published Sun, Aug 18 2019 8:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement