ఖమ్మం : మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతిపరులైన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు స్థానిక ఎస్సై కడారి ప్రసాద్ గురువారం తెలిపారు. మానుగట్ట గ్రామానికి చెందిన మడకం ఇర్మయ్య, పీ.జిన్నెలగూడెం, కె.జిన్నెలగూడెం గ్రామాలకు చెందిన కణితి ముదరాజు, పాయం వీరాస్వామి, తుర్రం ధర్మయ్య, కణితి లక్ష్మయ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్సై ప్రసాద్, స్పెషల్పార్టీ పోలీసులు బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని పోలీసుస్టేషన్కు తరలించి విచారించారు. తాము మావోయిస్టు సానుభూతిపరులుగా ఉంటూ..మిలీషియూ సభ్యులుగా వ్యవహరిస్తున్నామని వారు తెలిపారు. మావోయిస్టులకు మందులు, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తునట్లు వారు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. గురువారం వారిని కోర్టులో హాజరుపరిచామని పోలీసులు చెప్పారు.