పంట ఎండిపోవడం, అప్పులు తీరేమార్గం లేదని ఉరివేసుకున్న అన్నదాత
పరిగి మండలం రూప్ఖాన్పేట్లో విషాదం
పరిగి : కష్టపడి సాగుచేసిన పంట ఎండిపోవడంతో ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన పరిగి మండల పరిధిలోని రూప్ఖాన్పేట్ లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నసాయన్నొళ్ల గోపాల్(38) తనకున్న మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖరీఫ్ సీజన్లో ఆయన మొక్కజొన్న పంట వేశాడు. కుటుంబ అవసరాలు, పెట్టుబడి కోసం తెలిసిన వారి వద్ద రూ.లక్ష అప్పు చేశాడు.
పరిగిలోని ఏడీబీ(అగ్రికల్చర్ డెవలప్మెంటు బ్యాంకు)లో గతంలో రూ. 40 వేలు రుణం తీసుకోగా వడ్డీతో కలిసి అది రూ. 70 వేలకు చేరుకుంది. ఇటీవలి వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయింది. గోపాల్ శుక్రవారం ఉదయం పరిగి ఏడీబీకి అప్పు కోసం వెళ్లగా గతంలో తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాలని స్పష్టం చేశారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో గోపాల్ మదనపడ్డాడు. ఓ పక్క పంట ఎండిపోవడం.. మరోపక్క అప్పు పుట్టకపోవడం, కుటుంబం గడవడం కష్టంగా ఉండడంతో ఏంచేయాలో తోచడం లేదని గోపాల్ భార్య అమృతమ్మతో చెప్పి మనస్తాపానికి గురయ్యాడు.
శుక్రవారం రాత్రి ఆయన భార్యాపిల్లలతో కలిసి భోజనం చేశాడు. ఇంట్లో అందరూ నిద్రించాక బయటకు వెళ్లి పక్కనేఉన్న పూరి గుడిసెలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం కుటుంబీకులు నిద్రలే చి చూడగా గోపాల్ కనిపించలేదు. కొద్దిసేపటికి పూరిగుడిసెలో మృతదేహంగా వేలాడుతూ కనిపించాడు. మృతుడి భార్య అమృతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి కూ తుళ్లు అనిత(12), శిరీష(10) శ్రీలత(3) ఉన్నారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి..
గోపాల్కు అప్పు ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి మృ తుడి కుటుం బాన్ని ఆదుకో వాలన్నారు.
ఆయువు మింగిన అప్పులు
Published Sat, Aug 1 2015 11:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement