హైదరాబాద్: ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిత్యం సవాళ్లు.. రుసరుసలు, ఎద్దేవాలు, ఖండనలు, తిట్లు, చివాట్లతో తీరిక లేకుండా ఉండగా.. వారికంటే తామేం తక్కువ అని వారిద్దరి కుమారులు కే తారక రామరావు, నారా లోకేశ్ నాయుడు కుస్తీలకు దిగారు. అయితే, అదేదో ప్రేక్షకుల మధ్యనో, నిర్ణీత ప్రాంతంలోనో కాదు.. ఆంధ్ర తెలంగాణలో అయితే అసలే కాదు. అది అమెరికాలో.. కుస్తీ అంటే బస్తీ మే సవాల్ అని జబ్బలు చరిచి కలబడే కుస్తీ కాదు. తమ రాష్ట్రాలకు పెట్టుబడుల ప్రవాహాన్ని పారించే కుస్తీ.
కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రాలకు పెట్టుబడులను భారీ సంఖ్యలో తీసుకొచ్చి.. ఇటు రాష్ట్ర ప్రజల మెప్పును, తమ కుమారులు మంచి పనిమంతులే అని తమ తండ్రుల నుంచి కూడా మెప్పులు పొందేందుకు వెళుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే లోకేశ్ రెండు రోజుల ముందుగానే అమెరికా బయలుదేరి ఉండగా.. తాజాగా మంగళవారం కేటీఆర్ బయలు దేరారు. రెండు వారాలపాటు జరగనున్న వారిద్దరి టూర్లలో పెట్టుబడికి తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సదుపాయాలను కల్పించనున్నాయో వివరించనున్నారు.
వీరిద్దరికి అక్కడి పరిస్థితులు కూడా కొంత తెలుసు. ఎందుకంటే లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయగా.. కేటీఆర్ న్యూయార్క్ యూనివర్సిటీలోని బారుఖ్ కాలేజీలో చదివాడు. అయితే, బాధ్యతల రీత్యా మాత్రం కేటీఆర్కే కాస్త అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం తెలంగాణలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. దీంతో ఆయన పారిశ్రామిక వేత్తలకు ఐటీ, ఏయిరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో న్యూయార్క్, డల్లాస్వంటి ప్రముఖ నగరాల్లో ప్రెజెంటేషన్ చేయనున్నారు. లోకేశ్ ఏ అంశంపై ప్రజెంటేషన్ ఇస్తారో తెలియదు. కాకపోతే ప్రభుత్వంలో ఏ పదవిలేని లోకేశ్కు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న అతడి స్నేహితుడు ఎస్ అబీష్ట ఉన్నారు.
అధికార వర్గాల సమాచారం మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లతో లోకేశ్ సమావేశమవుతారని తెలిసింది. ఇక ఇంత జరుగుతున్నా తమ మధ్య ఎలాంటి పోటీలు లేవని, కేవలం బ్రాండ్ ఆంధ్ర, బ్రాండ్ తెలంగాణ, భ్రాండ్ హైదరాబాద్ కోసమే తమ ప్రణాళికలు, కార్యచరణ అని చెప్తున్నారు. ఏది ఏమైనా తండ్రుల్లాగే పోటీపడుతున్న ఈ యువనాయకులు అమెరికా నుంచి ఎన్ని కోట్ల పెట్టుబడులు తమ రాష్ట్రాలకు తీసుకొచ్చి శబాష్ అనిపించుకుంటారో వేచి చూడాలి.
కేటీఆర్, లోకేశ్ పైసల కుస్తీ!
Published Tue, May 5 2015 9:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement