కారును ఢీకొన్న డీసీఎం.. ముగ్గురికి గాయాలు | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న డీసీఎం.. ముగ్గురికి గాయాలు

Published Tue, Apr 21 2015 6:01 PM

3 members injured in a road accident in warangal district

వరంగల్: వేగంగా ప్రయాణిస్తున్న డీసీఎం వాహనం ఓ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం చింతకుంట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. చింతకుంట ప్రాంతంలోని పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న కారుని డీసీఎం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ తో పాటు అందులో ప్రయాణిస్తోన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వెంటనే అతన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
Advertisement