- చెలరేగిన కామాంధులు
- తండ్రిపై దాడి చేసి కూతురి అపహరణ
- ఆటోలో ఎత్తుకెళ్లిన ఐదుగురు దుండగులు
- సామూహిక అత్యాచారం, ఆపై హత్య
- రంగారెడ్డి జిల్లాలో రాక్షసకాండ
బంట్వారం: మానవ రూపంలోని రాక్షసులు చెలరేగిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా పైశాచికంగా వ్యవహరించారు. తండ్రి కళ్లముందే కూతురిని ఆటోలో అపహరించుకుపోయారు. సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. అందరినీ కలచివేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బంట్వారం మండల పరిధిలోని మోత్కుపల్లి గేటు సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఇరవై రోజుల క్రితం హైదరాబాద్లోని లింగంపల్లిలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. తండ్రి మెగావత్ కమాల్ గురువారం తన కూతురిని తీసుకురావడానికి మోపెడ్పై వికారాబాద్ వచ్చి అక్కడి నుంచి రైలులో లింగంపల్లికి చేరుకున్నాడు. సిమ్రాన్ను తీసుకుని రాత్రి ఎనిమిది గంటలకు వాడీ ప్యాసింజర్ రైలులో వికారాబాద్ వచ్చాడు. అక్కడి నుంచి మోపెడ్పై తండ్రీకూతుళ్లు స్వగ్రామానికి బయల్దేరారు.
మార్గమధ్యంలోని మోత్కుపల్లి గేటు సమీపంలో చేతిపంపు వద్ద ఆగి నీళ్లు తాగుతుండగా.. అక్కడే ఆగి ఉన్న ఆటోలోంచి ఓ దుండగుడు వీరి వద్దకు వ చ్చి కమాల్పై దాడి చేశాడు. వెనువెంటనే మరో నలుగురు చెట్ల పొదల్లోంచి వచ్చి బాలికను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మోత్కుపల్లివైపు వెళ్లిపోయారు. దుండగుడి దాడితో స్పృహ కోల్పోయిన కమాల్ను ఓ డీసీఎం డ్రైవర్ గమనించి నీళ్లు తాగించాడు. కొద్దిసేపటికి తేరుకున్న ఆయన కూతురు కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. కమాల్ సమాచారంతో తండావాసులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మోమిన్పేట ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
పోలీసు బృందాలు గురువారం రాత్రంతా గాలించినా బాలిక జాడ తెలియరాలేదు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మోత్కుపల్లి గేటు సమీపంలో రోడ్డుపక్కనే బాలిక మృతదేహం కనిపించింది. దుండగులు అత్యాచారం చేసి, అనంతరం గొంతు నులిమి చంపేసిన ఆనవాళ్లు కనిపించాయి. జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీం, డాగ్స్క్వాడ్లతో పరిశీలించారు. పోలీసు జాగిలం సమీప బార్వాద్ గ్రామంలోని ఆరుగురి ఇళ్లలోకి వెళ్లి ఆగిపోయింది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
రంగంలోకి ఐదు బృందాలు: ఎస్పీ
గిరిజన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసింది స్థానిక దుండగులేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసు యంత్రాంగం ఐదు బృందాలను రంగంలోకి దించింది. దారుణానికి ఒడిగట్టిన ముఠాను పట్టుకునేందుకు పరిసర గ్రామాల్లోని కొందరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
ఎన్కౌంటర్ చేయాలి: శకుంతల, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు
బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి. ‘నిర్భయ’ లాంటి చట్టాలు ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల రక్షణ కోసం 24 గంటలపాటు మానిటరింగ్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
మరో మొగ్గను చిదిమేశారు
Published Sat, May 23 2015 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement