-
కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే!: కిషన్రెడ్డి
కె.రాహుల్తెలంగాణలో బీజేపీకి పోటీయే లేదని.. రెండో స్థానం కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో చాలా వరకు బీజేపీ–కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని.. అక్కడక్కడా బీఆర్ఎస్ తమతో తలపడాల్సి రావచ్చునని వ్యాఖ్యానించారు. గ్యారంటీలను, హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో చెప్పుకోవడానికి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేకనే.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల 13న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ప్రచార పర్వం, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. బీజేపీకే అనుకూల వాతావరణం తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడంతో అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు బీఆర్ఎస్ను వెన్నాడుతున్నాయి. దీంతో మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 12 స్థానాలకు మించి వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. మేం కచ్చితమైన ఎన్నికల కార్యాచరణతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలోని ఒక్కో ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు, టీమ్లు ఏర్పాటు చేశాం. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులను ఒక్కో అసెంబ్లీకి పంపించాం. ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇంకా ఏ పార్టీ, ఎంపీ అభ్యర్థులు కూడా పోలింగ్బూత్ స్థాయి వరకు చేరుకోలేదు. మేం మాత్రం కచ్చితమైన ప్రణాళికతో బూత్ స్థాయి వరకు ఓటర్లను చేరుకున్నాం. బీజేపీ బలాన్ని పెంచుకుంటున్నాం.. హైదరాబాద్ నుంచి బరిలో ఉన్న మాధవీలత, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న వినోద్రావు బీజేపీలో ఉన్నవారే, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్నవారే. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు కొన్ని సీట్లలో ఇతర పార్టీల వారికి, బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ ఇంకా చిన్న పార్టీ. పెరగాల్సిన అవసరం ఉంది. సంకీర్ణమైతే దేశం ష్టుపడుతుంది రాబోయేది సంకీర్ణ యుగమంటూ మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ సంకీర్ణంలో చేరుతారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం ఆయనను చేర్చుకునే ప్రసక్తే లేదు. సంకీర్ణమంటే దేశమైనా, రాష్ట్రమైనా ష్టుపడతాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎవరికి వారు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ పరిస్థితి పట్ల ప్రజలు విసిగి వేసారాకే.. 2014లో, 2019లో బీజేపీకి మెజారిటీ కట్టబెట్టారు. ఎన్డీయేను అందలం ఎక్కించారు. ఈసారి గెలిచాక జమిలి ఎన్నికలే.. మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) విధానంతో ముందుకెళతాం. వచ్చే ఎన్నికలు కలిసే జరుగుతాయి. దేశంలో జనగణనతోపాటు నియోజకవర్గాల పునరి్వభజన జరగాల్సి ఉంది. ఇందులో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయంటూ దుష్ఫ్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. సీఎం, మాజీ సీఎం స్థాయివాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు! ప్రస్తుతం రాజకీయ వాతావరణమంతా కలుషితమై పోయింది. గతంలో ఎన్నికలంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ మాత్రం సంబంధం లేని విషయాలు ప్రస్తావించడం, అబద్ధాలు మాట్లాడటం, ఉపయోగించే భాషపై నియంత్రణ లేకపోవడం పెరిగింది. కొడతా, తిడుతా, చంపుతా, పాదాల కింద నలిపేస్తా అంటూ సీఎం, మాజీ సీఎం స్థాయిల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రచారంలో, మాట్లాడే మాటల్లో నైతికత లేకుండా పోయింది. హైదరాబాద్ లోక్సభ స్థానం సహా అన్నిచోట్లా డబ్బులే కీలకపాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. రాముడి పేరిట కాదు.. అభివృద్ధిని చూపి వస్తున్నాం బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా రాముడి ప్రస్తావన ఉందా? మీడియా, వార్తాపత్రికల్లో దీని ప్రాతిపదికన ఎక్కడైనా ఓట్లు అడిగామా? పదేళ్లలో మేం ఎంత అభివృద్ధి చేశాం, ఏయే రంగానికి ఎన్నెన్ని నిధులిచ్చామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఎంత మందికి బియ్యం ఇస్తున్నాం, రైతులకు ఏం చేశామనేది చెప్తున్నాం. మేం రాముడి పేరిట ఓట్లు అడుగుతున్నామని విమర్శిస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి దేశంలో సుస్థిర ప్రభుత్వం రావడం ద్వారా అవినీతి, అక్రమాలకు చెక్పెట్టవచ్చు. ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. ఇక ముందు మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరుతున్నాను. రేవంత్కు ముందుంది ముసళ్ల పండుగ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి ఓట్లు అడిగే నైతికహక్కు లేదంటున్నాం. మా ఇంటింటి ప్రచారంలో ఈ విషయాన్ని ప్రజలకు చెప్తుంటే మంచి స్పందన వస్తోంది. రేవంత్రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలు ఎలా చేస్తారు? ఇప్పుడు తొందరపడి ఎగిరెగిరి పడితే సరిపోతుందా? భూములు అమ్మి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు? ఏం చేస్తారనేది ప్రజల ముందు ఉంది. కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరీ దారుణంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ఫ్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం. -
ఈ నెల 8లోగా రైతు భరోసా... లేకుంటే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 8వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని.. లేకుంటే 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాస్తానని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. మరి అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. ఆగస్టు 15 నాటికల్లా రైతుల రుణమాఫీ చేస్తామని.. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ రెడీ పెట్టుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. ఈ నెల 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ మధ్య ఫైనల్స్ జరగనున్నాయని.. తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభ, వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో రేవంత్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా మీద రూ.ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లారు. ఈరోజు ఆయన రైతు భరోసా ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు. మేం రైతు భరోసా స్కీంను డిసెంబర్లోనే మొదలుపెట్టాం. రాష్ట్రంలో మొత్తం 69లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటికే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ చేశాం. మిగతా 4 లక్షల మంది ఖాతాల్లో ఈనెల 8వ తేదీలోగా రైతుబంధు తప్పకుండా జమ చేస్తాం.ఏ ఒక్క రైతు ఖాతాలోనైనా రైతుబంధు జమ కాలేదని నిరూపిస్తే.. అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతా. అర్హులందరికీ రైతుబంధు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. సిద్ధమా? రాష్ట్రంలో కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతలరాయుడిలా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పని అయిపోయింది. దింపుడు కల్లం ఆశలు పెట్టుకోవడం కూడా వృథా. మే 13న ఫైనల్స్డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ లాంటివి. ప్రజలు బీఆర్ఎస్ను మట్టికరిపించి కాంగ్రెస్ను ఆదరించారు. మే 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచి తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి.హరీశ్ రాజీనామాతో రెడీగా ఉండు.. బీఆర్ఎస్ పాలనలో 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడేళ్లయినా ఇవ్వలే. తునకలుగా ఇస్తే ఆ పైసలు మిత్తికి కూడా చాలలేదు. నేను అలా సోయి లేనోడిని కాదు. కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్నా.. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తా. హరీశ్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండు. రైతులకు బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వాతంత్య్రం ఇప్పిస్తా.. సిద్దిపేటకు నీ నుంచి విముక్తి కల్పిస్తా. బీజేపీకి వాత పెట్టాలి రాష్ట్ర విభజనపై ప్రధాని హోదాలో మోదీ మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణను అవమానించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ట్రిపుల్ ఐటీ, గిరిజన వర్సిటీ.. ఇలా ఏమీ ఇవ్వకుండా గాడిద గుడ్డు చేతిలో పెట్టిన బీజేపీ ఓటేద్దామా..? లేక కర్రు కాల్చి వాతపెడదామా ప్రజలే చెప్పాలి. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తూనే ఉంది. అందుకే కాంగ్రెస్ గెలవొద్దని బీఆర్ఎస్, బీజేపీ కలసి కుట్రలు చేస్తున్నాయి. ఎవరిని చెప్పుతో కొట్టాలి? రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్లని చెప్పుతో కొట్టాలని బీజేపీ నేతలు అంటున్నారు. నిన్ననే బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం ప్రియాంబుల్ (ప్రవేశిక)ను మార్చేస్తామన్నారు. మరి ఇప్పుడు దుష్యంత్™ కుమార్ను చెప్పుతో కొట్టాలా? అబద్ధాలు చెప్తున్న నేతలను చెప్పుతో కొట్టాలా? ఎవర్ని కొట్టాలో బీజేపీ నేతలే చెప్పాలి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. ఆ పార్టీ దేశ ప్రజల నెత్తిపై వేలాడుతున్న కత్తి లాంటిది. పాలమూరు బిడ్డపై కుట్ర.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పాలమూరు బిడ్డను సీఎంగా ఎన్నుకుని 150 రోజులు కాలేదు. అప్పుడే దిగిపొమ్మని అంటున్నారు. ఢిల్లీ నుంచి పడగొడతామని బయలుదేరుతున్నారు. రేవంత్రెడ్డి నా మీద పగబట్టిండని డీకే అరుణమ్మ అంటోంది. నీకు, నాకు గెట్టు పంచాయతీ ఏముంది? ప్రజల దీవెన, సోనియమ్మ ఆశీర్వాదంతో నాకు సీఎం పదవి వచ్చింది. కానీ నన్ను దించేందుకు, ఢిల్లీ పోలీసులతో అరెస్ట్ చేసేందుకు అమిత్ షాతో మాట్లాడి స్కెచ్ వేస్తోంది. నేనేం తప్పు చేశా? బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్నదని చెప్పిన. ఆ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను లోపలేసి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటున్నారు.’’ ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదు కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ప్రసంగించారు. – బ్రిటీషర్లకు ఎదురు నిలిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని, తెలంగాణ సీఎంపై బెదిరింపులకు పాల్పడుతున్న ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. – బీజేపీ రాముడిని రాజకీయాల్లోకి తెచ్చి నాలుగు అక్షింతలు చల్లి ఊరుకుందే తప్ప చేసిందేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సీఎంగా ఏనాడూ ఖమ్మం జిల్లాకు రాని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చి కల్లి»ొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. – రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నవారికి ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దమ్ముంటే యోధుడైన రేవంత్ను టచ్ చేసి చూడాలని ప్రత్యర్థి పారీ్టలకు సవాల్ విసిరారు. – పాలమూరు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్నికలు జరగబోతున్నాయని కొత్తకోట కార్నర్ మీటింగ్లో మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తంగా 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, హైదరాబాద్ సిటీ పరిధిలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్తో బోణీ కొట్టాలన్న కసితో ఉంది. ప్రత్యర్థులకంటే తామే ఇక్కడ బలంగా ఉన్నామని భావిస్తున్న బీఆర్ఎస్, సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్లో తొలిసారిగా రెండో స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయతి్నస్తోంది. మొత్తానికి మూడు పార్టీలూ ఉపఎన్నిక విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె అక్క నివేదిత బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన శ్రీగణేశ్, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఈసారి కొత్త అభ్యర్థి అయిన డాక్టర్ టీఎన్ వంశ తిలక్కు పార్టీ టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్.. నివేదితదివంగత ఎమ్మెల్యే సాయన్న 2014లో టీడీపీ నుంచి గెలిచి రెండేళ్లలోనే బీఆర్ఎస్లో చేరారు. అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2018లో తొలిసారిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. గతేడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన స్థానంలో చిన్న కుమార్తె లాస్య నందిత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔటర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం కాగా, బీఆర్ఎస్ మళ్లీ సాయన్న రెండో కుమార్తె నివేదితకు టికెట్ కేటాయించింది. అయితే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, గజ్జెల నాగేశ్, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్లు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారానికి వారు దూరంగా ఉన్నారు. లాస్య నందిత గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటూ పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఒకనాటి సాయన్న అనుచరులు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బోర్డు మాజీ సభ్యులు మాత్రం అండగా నిలవగా, సాయన్న, సోదరి లాస్య సెంటిమెంట్పై ఆశలతో నివేదిత తన ప్రచారం కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్, తండ్రి, సోదరి సెంటిమెంట్తో తన గెలుపు ఖాయం అన్న ధీమాలో ఉన్నారు.అనుకూలతలు» దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె కావడం » ఏడాదిలోనే ఎమ్మెల్యే హోదాలోనే తండ్రి, సోదరిని కోల్పోయిన సానుభూతి » పటిష్టమైన పార్టీ కేడర్ ప్రతికూలతలు»పెద్ద సంఖ్యలో నేతలు పార్టీని వీడటం » ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే గతానుభవాలు » కీలకనేతలు ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్.. శ్రీగణేశ్నారాయణ్ శ్రీగణేశ్ పదిహేనేళ్ల క్రితమే కాంగ్రెస్ యువ నాయకుడిగా కంటోన్మెంట్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే 2018లో ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలకతీతంగా శ్రీగణేశ్ ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవతో కంటోన్మెంట్ ఓటర్లకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో 2023లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో అధికార కాంగ్రెస్ శ్రీగణేశ్ను పార్టీలోకి ఆహా్వనించింది. శ్రీగణేశ్ వ్యక్తిగత బలం, అధికార పార్టీ అండతో గెలుపు ఖాయం అన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. చేరికల జోరుతో కాంగ్రెస్ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అనుకూలతలు» అధికార పార్టీ అభ్యర్థి కావడం » ఓడిపోయినా ప్రజల్లోనే ఉండటం » పార్టీలకతీతంగా సొంత కేడర్ ప్రతికూలతలు» తరచూ పార్టీలు మారతాడన్న అపవాదు » పాతనేతలు, కొత్తగా చేరుతున్న వారిమధ్య సమన్వయలేమి » కొన్ని వార్డుల్లో పార్టీ బలహీనంగా ఉండటంబీజేపీ.. టీఎన్ వంశ తిలక్ ఉత్తరాది ప్రాంతాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉండే కంటోన్మెంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఎంపీగా గెలిచినా, కంటోన్మెంట్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ను దాటి రెండో స్థానంలో నిలిచింది. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది. అయితే ఆ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి శ్రీగణేశ్ కాంగ్రెస్లోకి చేరడంతో మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి కుమారుడైన డాక్టర్ టీఎన్ వంశ తిలక్కు టికెట్ కేటాయించింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కావడంతో సీనియర్ నేతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేకపోయారు. అయితే మాదిగ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న తమ డిమాండ్కు తలొగ్గిన బీజేపీకి ఎమ్మార్పిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి రావడంతో మోదీ చరిష్మాతో బీజేపీ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది.అనుకూలతలు» పటిష్టమైన పార్టీ కేడర్ » ఎమ్మార్పిఎస్ సంపూర్ణ మద్దతు » మోదీ చరిష్మాతో ఉత్తరాది ఓట్లపై ఆశలు ప్రతికూలతలు » కంటోన్మెంట్కు పరిచయం లేని వ్యక్తి » పార్టీ నేతల మధ్య సమన్వయలేమి » ప్రచారంలో వెనుకబడిపోవడం -
కేసీఆర్ను అవమానిస్తే సహించం
దుబ్బాక: కేసీఆర్ను అవమానిస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ‘ఏదో అడ్డిమారి గుడ్డిదెబ్బలా గెలిచిన రేవంత్రెడ్డీ.. నీవు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొదట అమలు చేయి.. చేతకాకపోతే నాతో కాదు అని ప్రజలకు క్షమాపణ చెప్పు’ అంటూ సవాల్ విసిరారు. శనివారం రాత్రి దుబ్బాకలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి హరీశ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ జూటా మాటలతో గెలిచి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఈ రివర్స్గేర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. ‘బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టింది కాంగ్రెస్ కాదా?.. జీఎస్టీ విధించింది బీజేపీ కాదా?..’ అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చింది కేసీఆరేనని గుర్తుచేశారు. ‘పెన్షన్లు ఎటు పాయే.. ఆడబిడ్డలకు రూ.2,500, తులం బంగారం ఎటు పాయే’, ‘కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.. మళ్లీ మోటార్లు కాలిపోయే కాలం వచ్చింది’ అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్రావును దుబ్బాకలో ప్రజలు మడతపెట్టి ఉతికినట్టే ఈ ఎన్నికల్లోనూ మరోసారి ఉతికి ఆరేయాలన్నారు. -
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ నిధులొచ్చాయో చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసి రారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 2004–14 మధ్య యూపీఏ సర్కార్ ఇచ్చిన నిధులు, 2014–24 మధ్య తమ ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అందించిన నిధులపై అర్థవంతమైన చర్చ చేపడదామన్నారు. ఎవరి పాలనలో ఎక్కువ నిధులొచ్చాయో ఆధారాలతో ప్రజల ముందు చర్చిద్దామని సూచించారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులు అందించిందని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో విభేదిస్తే తనతో సీఎం చర్చకు రావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్కు కిషన్రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘కొడంగల్ లేదా అమరవీరుల స్తూపం లేదా కృష్ణా, గోదావరి ఒడ్డునైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. స్థలం, సమయం, తేదీ నిర్ణయించాలని రేవంత్ను లేఖలో కోరారు. అయితే చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సవాల్ను స్వీక రించి అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు సీఎం సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుడదామన్నారు.‘గాడిద గుడ్డు’ను ఖండిస్తున్నాం..‘2014–24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ మీరు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్లో భాగస్వామిగా వ్యక్తిగతంగానూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’అని కిషన్రెడ్డి లేఖలో స్పష్టంచేశారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి పదవినే దిగజారుస్తుందని మండిపడ్డారు. అబద్ధాల ప్రచారం సరికాదు..‘పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా గతంలో యూపీఏ సాధించిన ఘనతలు, విజయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఎన్డీయే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా మీరు విమర్శించవచ్చు. కానీ మీరు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే’అవుతుంది అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చింది రూ. 45 వేల కోట్లే‘మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కిందనే ఏకంగా రూ. 2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ. 1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ. 45,000 కోట్లు మించదు. అంటే యూపీఏ హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ కు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. 1947 నుంచి 20 14 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్లకుపైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించింది. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు సహా మరో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాం. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చాం’అని కిషన్రెడ్డి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement