-
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ ఆసిఫాబాద్: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, మతపరమైన (ముస్లిం) రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో ఎవరూ రిజర్వేషన్లను తొలగించకుండా చూస్తామని.. ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఆర్ఆర్ (రాహుల్గాం«దీ, రేవంత్రెడ్డి) టాక్స్ వసూలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీని అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఆ ఏటీఎంలో డబ్బుల్లేకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలి్పస్తామని నేను ఇటీవల ఓ సభలో చెప్పాను. ఆ వీడియోను ఎడిట్ చేసి మోదీ రిజర్వేషన్లు తొలగిస్తారని అన్నట్టుగా ప్రజల్లో దు్రష్పచారం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రిజర్వేషన్లు తొలగించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లతో విద్యా, ఉద్యోగ అవకాశాలు కలి్పంచింది. మోదీ ఆరి్టకల్ 370ను రద్దు చేశారు, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. రామమందిర నిర్మాణం చేశారు. ఆర్టికల్ 370ను రద్దుచేస్తే కశీ్మర్లో రక్తపుటేరులు పారుతాయని రాహుల్గాంధీ అడ్డుపడే ప్రయత్నం చేశారు. అది చేసి ఐదేళ్లు గడిచిపోయాయి రక్తపుటేరులు కాదు.. కనీసం రాళ్ల దాడి చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే.. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి, ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పారీ్టలు సంతుïÙ్టకరణ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్.. ఈ మూడు పారీ్టలు ఓటుబ్యాంకు కోసం రామనవమి యాత్రకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టాయి. బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కేంద్రంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అయోధ్య సమస్యను పరిష్కరించలేదు. మోదీ ఐదేళ్లలో పరిష్కరించి, రామమందిర నిర్మాణం పూర్తి చేశారు. రామాలయ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానించినా.. ఒకవర్గం ఓట్ల కోసమే రాహుల్గాం«దీ, మల్లికార్జున ఖర్గే అయోధ్యకు రాలేదు. ఇండియా కూటమికి నాయకత్వమేది? ఇప్పుడు ఎన్నికల్లో ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమి ఉన్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కావాలా? 23 ఏళ్లు సీఎం, పీఎంగా ఉన్నా ఒక్క అవినీతి మరకలేని మోదీ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. దీపావళి నాడు కూడా సెలవు లేకుండా దేశ సైనికులతో కలసి పండుగ జరుపుకునే మోదీ ఓవైపు ఉంటే.. నోట్లో బంగారు స్పూన్తో పుట్టి, ఎండ పెరగగానే బ్యాంకాక్, థాయ్లాండ్కు చెక్కేసే రాహుల్ గాంధీ మరోవైపు ఉన్నారు.. ఎవరు కావాలి? ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాన మంత్రి ఎవరు? అంటే ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ఉంటారని అంటున్నారు. అలాంటి ఇండియా కూటమి భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారి ఏదైనా వస్తే కాపాడగలదా? ఆ మోదీకే ఉంది. యావత్ భారతానికి ఉచితంగా, వేగంగా వ్యాక్సినేషన్ చేయించారు. ఆ ముందు చూపుతోనే మనమంతా బతికిపోయాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేసింది తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. అన్నిరకాలుగా ఆదుకుంటోంది. ఇక్కడి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ మోదీ ప్రభుత్వమే సంపూర్ణంగా నిధులిచి్చంది. పసుపు బోర్డు ఇచి్చంది. 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, రూ.20వేల కోట్లతో రీజనల్ రింగ్రోడ్డు, రూ.1,100 కోట్లతో ఎంఎంటీఎస్ మంజూరు చేశాం. పీఎంజీఎస్వై కింద రూ.6 వేల కోట్లు ఇచ్చాం. బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు, హసన్–చర్లపల్లి ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్, రూ.2 వేల కోట్లతో కృష్ణపట్నం–హైదరాబాద్ పెట్రోల్ పైప్లైన్, రూ.1,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫాక్టరీ పునఃప్రారంభం వంటి చేపట్టాం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు ప్రారంభించాం. అవినీతిమయ కాంగ్రెస్ను తరిమికొట్టేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లతో మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు అందరూ ముందుకురావాలి. తెలంగాణలో 12 సీట్లలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా మారుస్తాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. నిజామాబాద్లోనే పసుపు బోర్డు.. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం.. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తాం. ఎంపీ అరి్వంద్ వెంటపడి మరీ పసుపు బోర్డు ఏర్పాటును సాధించుకున్నారు. మరోసారి అరి్వంద్ను గెలిపిస్తే మరిన్ని ప్రయోజనాలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల కారణంగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మేం వాటిని రైతుల భాగస్వామ్యంతో సహకార పద్ధతిలో తెరిపిస్తాం. బీడీ కారి్మకుల కోసం నిజామాబాద్లో ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తాం.రిజర్వేషన్లపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం: కె.లక్ష్మణ్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా బీజేపీ దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవబోతోందని చెప్పారు.మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ఈటల రాజేందర్ దేశం సుభిక్షంగా ఉండాలంటే.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టి బూటకమన్నారు. -
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు.. మిగిలే ఉంది, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మనమే పూర్తి చేయాలి. నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. రూ.1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోతోంది. అల్యూమినియం, ప్లాస్టిక్ పరిశ్రమలు కరెంటు కోతలతో అల్లాడుతుంటే మనసుకు దుఃఖం కలుగు తోంది. గతంలో మోదీనే అసూయ పడేలా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తీసుకువచ్చాం. నాలుగైదు నెలల్లోనే ఇంత వ్యతిరేకతా? ఇది కొసవరకు ఉండే ప్రభుత్వం కాదు.. దుర్మార్గులు ఆగం చేసిర్రు. ఏ మాత్రం అధైర్య పడొద్దు. రాజకీయాల్లో తాత్కాలిక సెట్బ్యాక్ అనేది సాధారణమే. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా వచ్చేది మన ప్రభుత్వమే’’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఏమన్నారంటే..? వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ‘‘తొమ్మిదేళ్లు నడిచిన కరెంటు ఇప్పుడెందుకు పోతోంది. వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ఉన్నది ఉన్నట్లు ఇస్తే చాలు కదా? మంచినీళ్లు ఎట్ల మాయమైనయ్, మళ్లీ బిందెలేసుకుని మహిళలు రోడ్ల మీదకు ఎందుకు వస్తుర్రు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి ప్రసవాలు పెంచాం. బాలింతలకు కేసీఆర్ కిట్, ఆడశిశువుకు రూ.13వేలు, మగశిశువుకు రూ.12వేలిచ్చి ఇంటికి పంపాం. కానీ, నేడు అవేమీ ఇవ్వడం లేదు.ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ మన గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ సీఎం రేవంత్ మౌనంగా ఎందుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో సాగునీరు తాగునీరుకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి గతంలో రైతులకు అన్యాయం చేసే ఏ విషయం నా దృష్టికి వచి్చనా.. వెంటనే దాన్ని తిప్పికొట్టాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నిలిచిన వారిని గెలిపిస్తే తెలంగాణ కోసం పార్లమెంట్లో దుంకి అందుకొని కొట్లాడుతారు. బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన గతంలో ఎన్నోసార్లు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడారు. నా ప్రచారాన్ని ఆపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నాయి, అందుకే 48 గంటల ప్రచారాన్ని నిలిపివేసేలా చేశారు.. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.’’అని కేసీఆర్ అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం ‘‘బీఆర్ఎస్ హయాంలో రైతు వలసల నిరోధానికి, వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించాం. నీటి కొరత తీర్చేందుకు మిషన్ భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, దళితుల ఆత్మగౌరవం కోసం దళితబంధు చేపట్టాం’’అని వివరించిన కేసీఆర్, హుజూరాబాద్లో 99% ధనిక దళితులే ఉన్నారని చెప్పారు.సమైక్యాంధ్రప్రదేశ్లో 53 లక్షల టన్నుల వరి ఉత్పత్తయితే తెలంగాణలో మూడు కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. పంటను దళారీల పాలు చేయకుండా కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకున్నామని వ్యాఖ్యానించారు. రైతులకు ఫ్రీ కరెంట్ కోసం రూ.12,000 కోట్లు, రైతుబంధు కోసం రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.. వరి కొనుగోలుతో రూ.750 కోట్లు నష్టం అయినా పర్వాలేదని 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.ఇంకా రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు‘‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పథకాలు నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారు. డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కోతలు అయినప్పటికీ రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు’’అని విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హైదరాబాద్పై కుట్ర
ముషీరాబాద్, ఉప్పల్, లింగోజిగూడ: విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్పై కుట్ర జరుగుతోందనీ, జూన్ 20 తరువాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి లూటీ చేయాలని బీజేపీ యతి్నస్తోందనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు (కేటీఆర్) ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాడు కేవలం ఐదు ఎంపీ సీట్లతోనే తెలంగాణ సాధించామనీ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు కేసీఆర్ చేతిలో పెడితే ఢిల్లీ మెడలు వంచి ఆర్నెల్లు తిరగకుండానే తెలంగాణలో అనూహ్య మార్పులు తీసుకువస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం రాంనగర్ చౌరస్తా సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా జరిగిన రోడ్షోలో, ఉప్పల్ రింగ్ రోడ్డులో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో, అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ఘాట్లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలయ్యాయా? కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. గ్యారెంటీలు అమలయ్యాయా అంటూ సభకు విచ్చేసిన ప్రజలను అడగగా అమలు కాలేదంటూ జవాబిచ్చారు. హైదరాబాద్లో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా.. అని ఆలోచించుకోవాలని సూచించారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే బీజేపీ ధరలు పెంచుడు తప్ప పదేళ్లల్లో చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. అభివృద్ధి ఎక్కడ అని అడిగితే గుడి కట్టినం అంటున్నారు.. ఓటు ఎందుకు వేయాలని అడిగితే నమో అని అంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాత్రం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు.70 రూపాయలు ఉన్న పెట్రోల్ రూ.110 అయిందని ఈసారి బీజేపీని గెలిపిస్తే రూ.400 దాటుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర కూడా తగ్గాలి కానీ రోజురోజుకూ పెట్రోల్ రేటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. తన ఆరోపణలు తప్పయితే రాజీనామా చేసి మీ ముఖాన కొట్టి పోతానని సవాల్ చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల తరువాత వారి ఉసే ఉండదన్నారు. రాహుల్ అమాయకుడే రాహుల్ గాంధీ అమాయకుడనీ, రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయనకేమీ తెలియదని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రాసి ఇచ్చింది మాత్రమే చదవుతు న్నారని కేటీఆర్ అన్నారు. నిర్మల్ సభలో రాహుల్ గాం«దీతో మొత్తం అబద్ధాలే చెప్పించారని, అమలు చేయని పథకాలు కూడా అమలు చేసినట్లు అయన తో చెప్పించడం దురదృష్టకరమన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్తారన్న పక్కా సమాచారం తనకుందని పేర్కొన్నారు.ఇవాళ మా ఇంట్లో 5 సార్లు కరెంటుపోయింది రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా కరెంట్ పోలేదనీ కానీ ఇప్పుడు ఎప్పుడు పడి తే అప్పుడు కరెంట్ పోతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఈ రోజు మాఇంట్లో కూడా 5సార్లు కరెంట్ పోయింది.. ఇదీ పరిస్థితి’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ వచి్చంది కరెంటు పోయింది’’అన్నచందంగా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించగా, కొంత మంది లాంతర్లు పట్టుకుని చూపించారు. -
నమ్మేదెట్టా? ఒట్టుల సీఎంను..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన రాదని.. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. వరి ధాన్యానికి బోనస్ బోగస్ అయిందని, ఆడపిల్లలకు ఇస్తామన్న తులం బంగారం హామీ తుస్సుమన్నదని వ్యాఖ్యానించారు. రైతు బంధుకు పరిమితులు పెట్టడం ఏమిటని.. కొత్త జిల్లాల రద్దు ఆలోచన ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి హామీలను అమలు చేయించాలంటే.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని పేర్కొన్నారు. మన నదులు, మన నీళ్లు, మన నిధులు.. మనకే దక్కాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. ఆదివారం సాయంత్రం జగిత్యాలలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. జగిత్యాలను జిల్లా చేసుకున్నం. ఈ రోజు జగిత్యాల జిల్లాను కొత్త ప్రభుత్వం తీసేస్తదట. ఉండాలా.. పోవాలా? మేం వరద కాలువను రిజర్వాయర్లా మార్చినం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వరద కాలువను, పంటలను ఎందుకు ఎండబెడుతోందో తెలియదు. మహిళలకు రూ.2,500 ఇస్తున్నామని రాహుల్ గాంధీ అంటున్నరు. మీకు వచ్చినయా? సీఎం రేవంత్ చెప్పినట్టుగా రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందా? ఏ ఊరు వెళితే ఆ ఊరి దేవుడి మీద ఒట్టుపెడుతున్న సీఎంను నమ్మే పరిస్థితి ఉందా? రైతు బంధుకు పరిమితి ఎందుకు? రైతుబంధుకు బదులు రైతు భరోసా పేరిట ఇస్తానన్న కాంగ్రెస్ రూ.15,000 ఇచ్చిందా? అందరికీ రైతుబంధు పడిందా? అసలు రైతుబంధుకు ఐదెకరాల పరిమితి పెడతారట. ఆరు, ఏడు ఎకరాలు ఉన్న రైతులు ఏం పాపం చేశారు? 20–25 ఎకరాలు అంటే సరేగానీ.. మరీ ఐదెకరాలకే పరిమితా? వరికి రూ.500 బోనస్ బోగస్ అయింది. కల్యాణలక్షి్మ, షాదీ ముబారక్లతోపాటు తులం బంగారం వచ్చిందా? తుస్ అయ్యిందా? మేం మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇచ్చాం.గత 9ఏళ్లు కరెంటు కోతలు లేవు. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. మా హయాంలో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు తెస్తే.. నేటి ప్రభుత్వం విధించే కరెంటు కోతలతో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేశారు. చేనేత, గీత, బీడీ కార్మికులను పట్టించుకుంట లేరు. అన్న వస్త్రం కోసం పోతే.. ఉన్న వస్త్రం పోయిందన్నట్టు తయారైంది పరిస్థితి. బీఆర్ఎస్ సెక్యులర్ పారీ్ట.. పదేళ్లలో అచ్చేదిన్ అన్న మోదీ ధరలు పెంచి సచ్చేదిన్ తెచి్చండు. జన్ధన్ ఖాతాల్లో ఎవరికైనా రూ.15 లక్షలు పడ్డయా? మోదీ హయాంలో యువత, మహిళలు, విద్యార్థులు.. ఇలా ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ముస్లింలకు విన్నవిస్తున్నా.. ఈ దేశం అందరిదీ.. నేడు దేశంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. మీరంతా కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. అందుకే అందరూ బీఆర్ఎస్కు ఓటేయాలి.కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరు గెలిచినా మోదీ ముందు మాట్లాడలేరని.. మన నిధులు, నీళ్లు, నదుల కోసం పార్లమెంట్లో కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయించాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు.కొండగట్టులో సమోసా తిని.. చాయ్ తాగి..ఆదివారం జగిత్యాలలో రోడ్ షో కోసం బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్.. దారి మధ్యలో కొండగట్టు వద్ద ఓ హోటల్ వద్ద ఆగి సమోసా తిని, చాయ్ తాగారు. అక్కడున్న ప్రజలు, కార్యకర్తలు కేసీఆర్తో సెలీ్ఫలు దిగారు. – కొండగట్టు (చొప్పదండి) -
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘మోసానికి, విశ్వసనీయతకు మధ్య పోటీ..ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య పోటీ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తరపున ఆదివారం రాత్రి తుక్కుగూడ, శంషాబాద్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ఈనెల 13న గుజరాత్ వర్సెస్ తెలంగాణ మధ్య పోటీ జరుగుతోంది. తెలంగాణకు చాంపియన్షిప్ తెచ్చే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. కందుకూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. ఎన్నికల తర్వాత స్వయంగా వచ్చి కొబ్బరికాయ కొడతా. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా రావాలన్నా.. కందుకూరు వరకు మెట్రో రావాలన్నా..వికారాబాద్లో పుట్టి నేరేడుచర్లలో ముగిసే మూసీ సుందరీకరణ జరగాలన్నా..కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి. రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తినందుకే నాపై కేసులు గత సెపె్టంబర్ 17న ఇదే తుక్కుగూడ వేదిక నుంచి ఆరు గ్యారంటీల హామీ ఇచ్చాం. 65 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. అదే స్ఫూర్తితో మళ్లీ ఇదే తుక్కుగూడ నుంచి దేశంలో గెలుపునకు ఐదు గ్యారంటీల మేనిఫెస్టో విడుదల చేశాం. ఆ రోజు నుంచి మోదీ, అమిత్షాకు నిద్రపట్టడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తినందుకు నాపై కేసులు పెట్టారు. ఢిల్లీ నుంచి పోలీసులను పంపాడు. అరెస్ట్ చేస్తామని అమిత్షా చెప్పుతుండు. విధానాలతో కొట్లాడతారో? కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడతారో? బీజేపీ నేతలే తేల్చుకోవాలి. నాకు కేసులు కొత్తకాదు. రాముడిని మోసం చేశారు ఎవరైనా పెళ్లయిన తర్వాత అక్షింతలు చేతికిస్తారు. కానీ బీజేపీ నేతలు రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముందే అక్షింతలు పంపారు. రేషన్బియ్యం తెచ్చి, స్థానికంగా పసుపు కలిపి, అయోధ్య అక్షింతలని చెప్పి రాముడిని మోసం చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని తెలంగాణలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారు. అవి నిజంగా అక్షింతలేనా? భద్రాచలం రాముడిపై ఒట్టేసి చెప్పగలరా? దేవుడంటే మీకు ఓట్లు కావొచ్చు, కానీ మేము హనుమంతునిలా విశ్వసిస్తాం. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్న వారంతా నకిలీ హిందువులే. పొలిమేర్ల దాకా తరిమికొట్టాలి తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకొని ఒకరు..దేవుడిని అడ్డం పెట్టుకొని మరొకరు ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణ తల్లి సెంటిమెంట్ను బీఆర్ఎస్ అడ్డుపెట్టుకొని వందల ఎకరాల్లో ఫాంహౌస్లు, వేలకోట్లు కొల్లగొట్టారు. అదే మోదీ దేవుడి పేరుతో దేశాన్ని కొల్లగొట్టేందుకు కుట్రపన్నారు. వీరు నకిలీ హిందువులు. పదేళ్లలో ఆయన చేసిందేమీ లేదు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఆయనకు లేదు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోదీని, ఆయన పార్టీని పొలిమేర్ల దాకా తరిమికొట్టాలి. చీరకట్టుకొని చింతమడకకెళ్లు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పథకాలు ఆయన కళ్లకు కనిపించడం లేదు. కేటీఆర్ నీవు ఒకసారి చీరకట్టుకొని బసెక్కి..చింతమడక, సిరిసిల్ల వరకు వెళ్లిరా. బస్సులో టికెట్ అడిగితే మా ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే. సబితమ్మా నీకు ఇది న్యాయమా? సబితక్క..బీఆర్ఎస్లో ఉంది. బీజేపీకి ఓటు వేయాలని చెబుతోంది. నమ్మిన పార్టీని, నమ్మిన నాయకున్ని, నమ్ముకున్న కార్యకర్తను నట్టేట ముంచుతున్నావు. సబితమ్మా నీకు ఇది న్యాయమా? నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ బీజేపీ గెలుపు కోసం ఎలా పని చేస్తావు? ఆనాడు నువ్వు కాంగ్రెస్ నుంచి గెలిచినా కేసీఆర్ నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఈనాడు ఆయన్ను కూడా మోసం చేయడం కరెక్టేనా’అని రేవంత్ ప్రశిం్నంచారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement