‘నల్లధనం వెలికితీత ప్లాఫ్‌ షో’ | Sakshi
Sakshi News home page

‘నల్లధనం వెలికితీత ప్లాఫ్‌ షో’

Published Thu, Dec 8 2016 6:36 PM

‘నల్లధనం వెలికితీత ప్లాఫ్‌ షో’

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితుల వద్దే నల్లధనం ఎక్కువగా ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌, జగ్గారెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల నల్లధనం వెలికితీత అనేది ప్లాఫ్‌ షో అని వ్యాఖ్యానించారు. నగదు ఉపసంహరణపై ఇష్టమొచ్చినట్టు పరిమితులు, నిబంధనలు విధిస్తూ మోదీ సర్కారు తుగ్లక్‌ ను తలపిస్తోందని విమర్శించారు.

నోట్ల కష్టాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ డుడు బసవన్నలా తలాడిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement