హైదరాబాద్: అవినీతి వ్యవహారంలో మెదక్ జిల్లా రామాయంపేట డివిజన్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) వి.రాజయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి విక్టర్ ఇమాన్యుయేల్ గురువారం తీర్పునిచ్చారు. 2004 ఫిబ్రవరి 4న ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రాజయ్య దగ్గర రూ.10 వేల అవినీతి సొమ్ము లభించింది. ఈ డబ్బును శంకర్పేట్ మండలం అంభాజీపేట నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడి నుంచి లంచం రూపంలో తీసుకున్నట్లు విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ.. అన్ని ఆధారాలతో కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది.
అవినీతి కేసులో డీఈఈకి ఏడాది జైలు
Published Fri, Dec 16 2016 2:24 AM
# Tag
Related news
-
ఏసీబీ వలలో డ్రగ్ ఇన్స్పెక్టర్
నల్లగొండ టౌన్: నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఊరెల్లి సోమేశ్వర్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ జగదీష్చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలోని నూకల వెంకట్రెడ్డి చారిటబుల్ ఆస్పత్రిలో ఫార్మసీ ఏర్పాటు లైసెన్స్ కోసం చిట్టెపు సైదిరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ ఇవ్వడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సోమవారం నల్లగొండలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రూ.18వేలు డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఇవ్వడానికి సైదిరెడ్డి వెళ్లాడు. డబ్బులను తన బ్యాగులో పెట్టాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ సూచించడంతో రూ.18 వేలను బ్యాగులో పెట్టగానే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు సోమేశ్వర్ను పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని సోమేశ్వర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లారు. సీఐలు వెంకట్రావు, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
మాదాపూర్ పీఎస్పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై
సాక్షి,హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం(ఏప్రిల్ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్ అవినీతి వ్యవహారం బయటపడింది. ఇదీ చదవండి.. కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్టెక్ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్ను అరెస్ట్ చేసింది. డిజైన్టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు -
ఏసీబీ వలలో మీర్పేట ఎస్ఐ
హైదరాబాద్: నోటరీ ప్లాటు విక్రయ సెటిల్మెంట్ వ్యవహారంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు అడ్డంగా దొరికిపోయాడు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాదర్గుల్కు చెందిన షేక్ నజీముద్దీన్ గత డిసెంబరులో సర్వే నంబర్ 197లోని తన 200 గజాల నోటరీ ప్లాటును గుర్రంగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదాని సుభాష్కు రూ.4.80 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సుభాష్ రూ.2.10 లక్షలు బయానా చెల్లించి ప్లాటుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ ప్లాటు కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉండడం, తాజాగా కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో నజీముద్దీన్ తన ప్లాటును తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేగా సుభాష్ అంగీకరించలేదు. దీంతో నజీముద్దీన్ ఈ నెల 23న మీర్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ బొడ్డుపల్లి సైదులుకు ఫిర్యాదు చేశాడు. సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసు అధికారి సుభా‹Ùను స్టేషన్కు పిలిపించి ప్లాటు పత్రాలు వెనక్కి ఇవ్వకపోతే, అవి పోయినట్లు దొంగతనం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన సుభాష్ ప్లాట్ కాగితాలు నజీముద్దీన్కు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసి ఎస్ఐ సుభాష్కు రూ.1.40 లక్షలు ఇప్పించాడు. ఇందులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.5వేలు ఇస్తానని ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత ఓసారి మధ్యవర్తి ముత్యంరెడ్డితో కలిసి స్టేషన్కు వచ్చాడు. రూ.10 వేలు ఇస్తామని చెప్పడంతో ఎస్ఐ ఓకే చెప్పాడు. ఈ వ్యవహారాన్నంతా బాధితుడు ముందుగానే సెల్ఫోన్లో రికార్డు చేసి ఏసీబీ అధికారులకు పంపాడు. శనివారం పీఎస్కు వచ్చిన సుభాష్ నుంచి ఎస్ఐ రూ.10 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్ఐ సైదులును మేజి్రస్టేట్ ఎదుట హాజరు పర్చడంతో పాటు తన ఇంట్లోని ఫైళ్లను తనిఖీ చేశామని తెలిపారు. 2021లో సరూర్నగర్ పీఎస్లో విధులు నిర్వర్తించిన సమయంలోనూ ఇలాంటి కేసులోనే ఎస్ఐ సైదులు సస్పెండ్ అయ్యాడని స్పష్టంచేశారు. లంచం కోసం ఇబ్బంది పెడితే 1064 ఏసీబీ టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Related News by category
-
నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు
ఎస్పీ బాలస్వామి మెదక్మున్సిపాలిటీ: నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఇందుకోసం సెంట్రల్ ఫోర్స్, ఆర్ముడ్, సివిల్ ఫోర్స్తో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్ నుంచి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హామీలను అమలు చేస్తాం పెద్దశంకరంపేట(మెదక్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉత్తులూర్కు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, రాంచందర్, పెరుమాండ్లుగౌడ్, ఎంపీటీసీ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం హవేళిఘణాపూర్(మెదక్)/నిజాంపేట: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హవేళిఘణాపూర్ మండలంలోని గాజుల్వయి తండాలో ఈదురుగాలులకు కరెంట్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తండావాసులు రాత్రంతా చీకట్లోనే గడిపారు. అలాగే నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సరిహద్దుల్లో పటిష్ట నిఘా కంగ్టి(నారాయణఖేడ్): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రఫీయొద్దీన్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిఽహద్దుల్లో ఉన్న మండల పరిధిలోని దెగుల్వాడి చెక్పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. ఎకై ్సజ్ పోలీసు కానిస్టేబుల్ సాయులు, ఏఈఓ సంతోష్ ఉన్నారు. -
కల్యాణ వైభోగమే..
బాజా భజంత్రీలు, భక్తజన హర్షధ్వానాలు, బ్రహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదిన వేళ మెదక్లోని కోదండ రామాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతులు సైతం కల్యాణ మహోత్సవంలో భాగస్వాములయ్యారు. పలువురు దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. – మెదక్మున్సిపాలిటీ -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
● ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు గజ్వేల్: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీని అందిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్లో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకుందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150 కోట్ల అభివృద్ధి పనులను ఆ పార్టీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్లో బలమైన ప్రజా గొంతుకగా మారతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జగదేవ్పూర్ సహకార సంఘం చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు కిషన్రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, కౌన్సిలర్లు బాలమణి, బొగ్గుల చందు, అత్తెల్లి శ్రీనివాస్, అహ్మద్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్త బలం
● నేటి నుంచి 25వ తేదీ వరకు స్వీకరణ ● మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాట్లుసాక్షి, సిద్దిపేట: లోక్సభ ఎన్నికల సమరంలో మొదటి ఘట్టం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మంచి ముహూర్తాలను చూసుకుంటున్నారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మెదక్ కలెక్టరేట్లో, జహీరాబాద్ స్థానం నుంచి బరిలో ఉండే అభ్యర్థుల నామినేషన్లు సంగారెడ్డి కలెక్టరేట్లో స్వీకరిస్తారు. నిర్ణీత సమయాల్లో సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు సమాయత్తం.. అభ్యర్థులు వారి పేరు మీద ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పురోహితులు సూచించిన తేదీల్లో సమయానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. మంచి రోజు మొదటి సెట్ వేసి తర్వాత భారీ ర్యాలీల ద్వారా వెళ్లి మిగతా సెట్లను వేయనున్నారు. బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్ గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను అయోధ్యలోని బాలరాముడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 20న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేయనున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే స్వతంత్రులు కూడా ముహూర్తాలను చూసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ : ఏప్రిల్ 18 తేదీ నుంచి.. చివరి గడువు : ఏప్రిల్ 25 పరిశీలన : ఏప్రిల్ 26ప్రక్రియ ఇలా.. ఓట్ల లెక్కింపు : జూన్ 4 పోలింగ్ తేదీ : మే 13 ఉపసంహరణకు గడువు : ఏప్రిల్ 29రానున్న ముఖ్యనేతలు ప్రధాన పార్టీలు నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థుల వెంట ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థులు పలువురిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు హాజరు కానున్నారు. 20న మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు, మంత్రులు హాజరుకానున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ర్యాలీ చేపట్టనున్నారు. కార్యక్రమానికి హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు రానున్నారు. -
సన్నాలకు ఫుల్ డిమాండ్
● క్వింటాల్కు రూ.2,500 చెల్లింపు ● జోరుగా ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సన్న ధాన్యానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. క్వింటాల్కు మద్దతు ధర రూ. 2,500 చొప్పున చెల్లించి వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర కంటే క్వింటాల్కు రూ. 297 అధికంగా రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. – మెదక్జోన్జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 2.63 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందుకు గానూ 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అంచనా వేసిన అధికారులు 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 2.3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు కాగా 60 వేల ఎకరాల్లో సన్న రకం సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు మద్దతు ధర రూ. 2,203 చొప్పున చెల్లిస్తోంది. సన్నరకం సాగు చేసిన రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.2,500 చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలకు క్వింటాల్కు రూ. 2,203 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాల్పై రైతుకు రూ.297 అదనంగా వస్తుండడంతో అన్నదాతలు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. మార్కెట్లో సన్న బియ్యం ధరలు సైతం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. ధర మరింత పెరిగే అవకాశం ప్రస్తుతం వ్యాపారులు సన్నాలను క్వింటాల్ రూ. 2,500 చెల్లించి కొనుగోలు చేస్తుండగా 10 రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాలకు పైగా సన్నాలను సాగు చేశారు. ధాన్యం చేతికందిన మొదట్లో వ్యాపారులు క్వింటాల్కు రూ. 2,400 చొప్పున చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేశారు. అనంతరం మరో 15 రోజుల తర్వాత క్వింటాల్కు రూ. 2,800 చెల్లించారు. కేవలం రెండు వారాల వ్యవధిలో క్వింటాల్కు రూ.400 ధర పెరిగింది. తగ్గనున్న ధాన్యం దిగుబడి యాసంగి సీజన్లో 1.34 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. రైతులు ఎక్కువగా బోరుబావుల ఆధారంగా వరి సాగు చేశారు. భూగర్భజలాలు అడిగంటిపోవడంతో చాలా వరకు బోర్లలో నీటి ఊటలు తగ్గి పంటలు ఎండిపోయాయి. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. నాలుగెకరాల్లో సన్నాలు సాగు చేశా నాలుగెకరాల్లో ఆర్ఎన్ఆర్ సన్న రకం వరి పంట సాగు చేశాను. సుమారు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్కు రూ. 2,500 చొప్పున విక్రయించాను. కొనుగోలు కేంద్రాల కంటే క్వింటాల్కు రూ. 297 అదనంగా లాభం వచ్చింది. – బాబు, గవ్వలపల్లి తండా
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
Photos
View allVideo
View allతప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement