-
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు రిచీ బెరింగ్టన్ సారథ్యం వహించనున్నాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న మైఖేల్ జోన్స్, పేసర్ బ్రాడ్ వీల్ తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఒమన్, నమీబియాలతో పాటు ఉంది. స్కాట్లాండ్ జట్టు మే 26న ఈ పొట్టి వరల్డ్కప్ కోసం కరేబియన్ దీవులకు పయనం కానుంది. స్కాటిష్ జట్టు ట్రినిడాడ్లో ఆఫ్ఘనిస్తాన్, ఉగాండాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. ఇక ప్రధాన టోర్నీలో స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 4 ఇంగ్లండ్తో తలపడనుంది.స్కాట్లాండ్ టీ20 వరల్డ్కప్ జట్టురిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఒలి హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్. -
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
టీ20 వరల్డ్కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ' 24 పేరుతో పీసీబీ తమ న్యూజెర్సీని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది నసీమ్ షా వంటి స్టార్ ప్లేయర్స్ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోను పీసీబీ షేర్ చేసింది.ఈ జెర్సీని పాకిస్తాన్ అభిమానులు పీసీబీ స్టోర్లో కొనుగోలు చేయవచ్చని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక పాక్ న్యూ జెర్సీ.. వారి సాంప్రదాయ ఆకుపచ్చ రంగులో ఉంది. టోర్నమెంట్కు చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉండగా, పీసీబీ లోగో ఎడమవైపు ఉంది.ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో జూన్ 6న అమెరికాతో తలపడనుంది. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత తమ జట్టును పీసీబీ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం భారత్ ఇప్పటికే తమ జట్టుతో పాటు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. Presenting you the Matrix Jersey is a symbol of unity 🇵🇰🌟Pre-order your Matrix Jersey now: https://t.co/TWU32T9BHd#WearYourPassion | #WeHaveWeWill pic.twitter.com/mbLUWqj6Pv— Pakistan Cricket (@TheRealPCB) May 6, 2024 -
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభానికి మరో ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్కు సమయం దగ్గరపడతుండడంతో క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల జెర్సీలను రిలీజ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో టీమిండియా వరల్డ్కప్ జెర్సీని బీసీసీఐ రివీల్ చేసింది. భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్ అడిడాస్ జెర్సీ రిలీజ్కు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది.టీమిండియా జెర్సీలో.. వీ షేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది.బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు జెర్సీ బాగొలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్లో జూన్5 న ఐర్లాండ్తో తలపడనుంది.ఇక పొట్టి ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, రింకూ సింగ్, శుబ్మన్ గిల్ వంటి స్టార్ క్రికెటర్లకు చోటు దక్కలేదు.టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,రిషభ్ పంత్, సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, ఆర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్మాన్ గిల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ View this post on Instagram A post shared by adidas India (@adidasindia)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement