న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో తనకు 'సెట్టింగ్' లు చేయడం చేతకాలేదని సరికొత్త వివాదానికి తెరలేపిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు, బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో సభ్యుడు సౌరవ్ గంగూలీ ఖండిచారు. అసలు సెహ్వాగ్ మాట్లాడిన దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. కోచ్ పదవికి ఆసక్తిలేకపోయినా, అందుకు ముందుకు రావడానికి బీసీసీఐలోని కొందరు పెద్దలే కారణమని సెహ్వాగ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోచ్ పదవి కోసం పైరవీలు చేయడం తనకు చేత కాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన గంగూలీ.. అది సెహ్వాగ్ అవివేకమని కొట్టిపారేశారు. కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో సెహ్వాగ్ భావన ఏదైతే ఉందో అది మొత్తం తప్పు అని గంగూలీ స్పష్టం చేశారు. తనకు సెహ్వాగ్ మంచి మిత్రుడని పేర్కొన్న గంగూలీ.. ఈ విషయంపై అతనితో త్వరలోనే మాట్లాడతానని పేర్కొన్నారు.
టీమిండియా కోచ్ గా రవిశాస్త్రిని బీసీసీఐలోని ముగ్గురు సభ్యుల అడ్వైజరీ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో గంగూలీ ఒక సభ్యుడిగా ఉండగా, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లు మిగతా సభ్యులు. ఇక్కడ ముగ్గురితోనూ సెహ్వాగ్ కు సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవం. అయితే కోచ్ పదవికి రవిశాస్త్రి చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ముందు వరుసలోకి రావడంతో సెహ్వాగ్ రేసులో వెనుకబడిపోయారు. తనను కోచ్ పదవి ఎంపికకు దరఖాస్తు చేసుకోమని ప్రేరేపించకపోతే అందుకు మొగ్గుచూపేవాడిని కాదనేది సెహ్వాగ్ వాదన. అదే సమయంలో రవిశాస్త్రి ముందుగానే దరఖాస్తు చేసుకునే ఉంటే కూడా కోచ్ పదవి కోసం ఆశ పడేవాడిని కాదని సెహ్వాగ్ తెలిపాడు. ఇక్కడ కోచ్ పదవి కోసం పైరవీలు చేయడం తనకు అలవాటు లేని పనిగా సెహ్వాగ్ పేర్కొనడం బీసీసీఐ పెద్దల్ని ఆలోచనలో పడేసింది.
అది సెహ్వాగ్ అవివేకం: గంగూలీ
Published Sun, Sep 17 2017 2:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement