టి20 ప్రపంచ కప్ నిర్వహణా భారం
ముంబై: టి20 మ్యాచ్లు అంటేనే ప్రపంచ క్రికెట్లో అదో రకం క్రేజ్... ఇక ప్రపంచ కప్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారత్లో ప్రపంచ కప్ అంటే ప్రేక్షకుల వీరాభిమానం, ప్రకటనల జోరు కలగలిసి బీసీసీకి భారీ ఆదాయం తెచ్చి పెట్టాలి. కానీ క్రికెట్ ప్రేమికుల దేశంలో తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచ కప్ బోర్డుకు ఆర్థికంగా నష్టాలే తెచ్చి పెట్టిందట! 2016 మార్చి, ఏప్రిల్లో దేశంలోని వేర్వేరు వేదికలపై టి20 వరల్డ్ కప్ జరిగింది. ఈ టోర్నీ వల్ల బీసీసీఐ రూ. 190 కోట్లు నష్టపోయిందని ఇటీవలి ఒక నివేదిక బయట పెట్టింది. దీనిపై కొద్ది రోజుల బీసీసీఐ–సీఓఏ మధ్య జరిగిన ప్రత్యేక సమావేశంలో చర్చ కూడా జరిగింది కానీ పరువు పోతుందనే ఆలోచనతో బోర్డు ఈ అంశాన్ని దాచి పెట్టినట్లు సమాచారం.
తొలిసారి సర్వీస్ ట్యాక్స్ రూపంలో భారత ప్రభుత్వానికి బోర్డు రూ. 150 కోట్లు చెల్లించాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా భద్రత పేరుతో మ్యాచ్ జరిగిన వేదికలకు ఒక్కోదానికి రూ. 40 లక్షల చొప్పున కూడా అందజేశారు. సాధారణంగా మన దేశంలో పోలీసులకు భద్రత కోసం రూ. 7–10 లక్షల మధ్య చెల్లిస్తూనే ఉంటారు. అయితే ఈ 40 లక్షల కోసం బోర్డు కనీసం ఐసీసీ నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. దాంతో ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు ఐసీసీ అంగీకరించలేదు.
జోహ్రి విహారం...: మరోవైపు బీసీసీఐ సీఈఓ హోదాలో రాహుల్ జోహ్రి చేస్తున్న ఖర్చులపై బోర్డు ఆఫీస్ బేరర్లు గుర్రుగా ఉన్నారు. బోర్డు కార్యదర్శి, కోశాధికారి ఖర్చుల గురించి సీఓఏ ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఉన్న వారు, కలిసి కట్టుగా జోహ్రిపై విమర్శలు ఎక్కు పెట్టారు. గత ఏడాది జూన్లో జోహ్రి సీఈఓగా ఎంపికయ్యారు. ఈ 14 నెలల కాలంలో ఆయన ప్రయాణ ఖర్చులే రూ. 70 లక్షలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల పేరు చెప్పి 125 రోజులు ఆయన విదేశాల్లోనే ఉన్నారు. దీనికి రోజుకు 500 డాలర్ల అలవెన్స్తో రూ. 41 లక్షలు ఖర్చు చేశారు. రోజుకు కనీసం రూ. 20 వేల అద్దె ఉండే ఖరీదైన హోటళ్లలో ఉంటూ వసతి కోసమే రూ. 16 లక్షలు చెల్లించారు. భారత్లో పర్యటించిన సమయంలో డీఏ, ఇతర ఖర్చులు కలిపి ఆయన ఖాతాకు ఏకంగా రూ. 38 లక్షలు వెళ్లాయి. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్న ఆఫీస్ బేరర్లు ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. వీటికి తోడు ముంబైలో జోహ్రి ఇంటి అద్దె నెలకు రూ. 5 లక్షలు కూడా బీసీసీఐనే చెల్లిస్తుండటాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
బీసీసీఐకి రూ. 190 కోట్ల నష్టం!
Published Sat, Aug 19 2017 12:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement