‘వైఎస్‌ఆర్‌ చిరకాలం మా గుండెల్లో ఉంటారు’ | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ఆర్‌ చిరకాలం మా గుండెల్లో ఉంటారు’

Published Sat, Dec 23 2017 2:59 PM

YSR still Alive in our heart, Couple meets YS Jagan in PrajaSankalpaYatra - Sakshi

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తమ గుండెల్లో చిరకాలం ఉంటారని రామకృష్ణ, రమాదేవి దంపతులు చెప్పారు. వీరి స్వస్ధలం అనంతపురం జిల్లా దొన్నికోట గ్రామం. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రామకృష్ణ, రమాదేవి దంపతులు శనివారం కలిశారు.

గతంలో వైఎస్‌ఆర్‌తో కలసి దిగిన ఫొటోను వైఎస్‌ జగన్‌కు చూపించారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం వల్లే తమ కుమారుడి ప్రాణాలు నిలిచాయని చెప్పారు. వైఎస్‌ఆర్‌ మరణించిన తమ గుండెల్లో చిరకాలం బతికేవుంటారని అన్నారు. పాదయాత్రతో ప్రజల్లోకి వచ్చినందుకు వైఎస్‌ జగన్‌ను అభినందించారు.

‘వైఎస్‌ఆర్‌ ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు’

Advertisement
Advertisement