ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం | Sakshi
Sakshi News home page

ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాం

Published Fri, Dec 15 2017 7:55 AM

Surpunches Fired On TDP Party In Praja sankalpa yatra - Sakshi

ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లను టీడీపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి జన్మభూమి కమిటీ సభ్యులతో ఆటవిక పాలన సాగిస్తోందని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సర్పంచ్‌ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లోక్‌నాథ్‌రెడ్డి, సర్పంచ్‌లు వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు ప్రజా సంకల్ప యాత్రలో ఆయనను కలిశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి పైసా కూడా నిధులు విడుదల చేయలేదని, పైగా అంగన్‌వాడీ కేంద్రాల విద్యుత్‌ బిల్లులను సైతం పంచాయతీ నిధులతోనే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారని విచారం వెలిబుచ్చారు. కేవలం 14వ ఆర్థిక సంఘం నిధులతోనే పాలనను నెట్టుకొస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement