అభిమానసంద్రం | Sakshi
Sakshi News home page

అభిమానసంద్రం

Published Wed, Feb 7 2018 7:16 AM

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగింది. సంగం మండలంలోని అన్నారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర సాగిన ఆద్యంతం జనం పోటెత్తారు. అభిమాన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చూసుకుని మురిసిపోయారు. పలువురు జననేత వైఎస్‌ జగన్‌ను కలిసి తమగోడును వెళ్లబోసుకోసుకున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారికి ధైర్యం చెబుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు. అనంతరం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంగంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

Advertisement
Advertisement