ఆ విషయం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది | Sakshi
Sakshi News home page

ఆ విషయం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది

Published Tue, Oct 17 2017 4:36 PM

kottu satyanarayana - Sakshi

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): వైఎస్‌ జగన్ పాదయాత్ర చేస్తారన్న విషయాన్ని టీడీపీ జీర్ణించుకోలేక దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ తాడేపల్లి నియోజకవర్గ కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుని, వారికి ఏవిధంగా మేలు చేస్తామో తెలియచేయటమే జగన్ పాదయాత్ర లక్ష్యమని పేర్కొన్నారు.

ఈమధ్య కాలంలో స్వర్గస్తులైన తన తండ్రి కొట్టు వెంకటేశ్వరరావు పేరు మీద మెమోరియల్ సొసైటీ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయబోతున్నానని ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సురక్షితమైన నీటిని అందించటమే ఈ ట్రస్టు యొక్క మొదటి ధ్యేయమన్నారు. ఇందులో భాగంగా కుంచెనపల్లి, యణాలపల్లి గ్రామాల్లో ముందుగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement