ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ
♦ గ్రామాలు, పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం
♦ ఇజ్రాయెల్లా భారత వ్యవసాయ రంగం
♦ {పధాన సేవక్ అయ్యాక అవినీతిని కడిగేస్తున్నాం
బెళగావి(కర్ణాటక): ప్రపంచ ఆర్థిక రంగానికి భారతదేశమే ఆశాకిరణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, గ్రామీణ ప్రాంతాల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కిసాన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకుతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు భారత్లో మెరుగుపడుతున్న పరిస్థితులను చూసి అద్భుతమైన రేటింగ్స్ ఇస్తున్నాయన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉన్నా.. భారత్ వాటన్నింటినీ తట్టుకుని బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ‘మేం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశమంతా అవినీతి వేళ్లూనుకుపోయింది. నేను ప్రధాన సేవక్గా వచ్చిన తర్వాత దేశంలో అవినీతికి తావు లేదు. విపక్షాలు ఎన్ని విషయాలను వివాదం చేసినా.. అవినీతి విషయంలో మాత్రం నోరువిప్పటం లేదు’ అని మోదీ అన్నారు. యూరియా నల్లబజారును అడ్డుకుంటున్నందుకు పలువురు అవినీతిపరులకు తాను కంట్లో నలుసులా మారానని అందుకే దేశాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వ్యవసాయ, తయారీ, సేవారంగాల్లో అభివృద్ధి తీసుకువచ్చి.. పేదలు, రైతులు, నిరుద్యోగుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ నినాదంతో వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ తరహా ఫలితాలు సాధిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులు ఏ క్షణంలోనూ కన్నీరు పెట్టరాదనే సంకల్పంతో తాను వినూత్న రీతిలో పథకాలు రూపొందిస్తున్నాన న్నారు. రాబోయే రోజుల్లో దేశంలో రైతే రాజుగా కొనసాగేలా ప్రభుత్వం అన్ని వనరులు సమకూరుస్తుందన్నారు. దేశ చరిత్రలో ప్రప్రథమంగా రైతుల కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి పంట బీమా పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం కర్ణాటక రైతులకు తామిచ్చినంతగా నిధులివ్వలేదన్నారు. దళారుల్లేకుండా జన్ధన్ ఖాతాల ద్వారా నేరుగా ప్రజల వద్దకే నిధులు చేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప తదితర నేతలు పాల్గొన్నారు. కాగా, సభాస్థలికి సమీపంలోని వాహనాల పార్కింగ్ వద్ద ఉన్న ఎండు గడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించటంతో కలకలం రేగింది. ఈ ఘటనలో 15 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక యంత్రాలు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశాయి.
ప్రపంచానికి భారత్ ఆశాకిరణం
Published Sun, Feb 28 2016 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement