ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య

Published Thu, Dec 29 2016 9:27 PM

ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజీవ్ దూబే గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. 1987 బ్యాచ్కు చెందిన దూబే లక్నోలో గౌతంపల్లిలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆ‍త్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హోంగార్డు డిపార్ట్ మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా దూబే విధులు నిర్వర్తించారు.

Advertisement
Advertisement