సెలవుల తర్వాత ఫుల్ రీచార్జ్ అయిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. విశ్లేషకులు సైతం ఊహించని రీతిలో మోదీ సర్కారుతో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆయుధంగా భూసేకరణ సవరణ బిల్లును ఉపయోగించుకోనున్నారు. అందులో భాగంగానే హిందూత్వ శక్తుల 'ఘర్ వాపసీ' కి కౌంటర్ ఇస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు 'జమీన్ వాపసీ' పేరుతో కాంగ్రెస్ పార్టీ శనివారం అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించింది.
ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలతోపాటు ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలను కూడా పొందుపర్చింది. తద్వారా తమ హయాంలోనే రైతులకు మేలు జరిగిందనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం (ఏప్రిల్ 19) జరగనున్న రైతు ర్యాలీకి మద్దతు తెలపాలంది. వెబ్సైట్లో పేర్కొన్న నంబర్కు మిస్డ్ కాల్ లేదా ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న భూ విప్లవ పోరాటాన్ని బలపర్చాలని కోరింది. అంతకుముందు ఉదయం వివిధ రైతుసంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే రైతుర్యాలీకి సన్నాహకంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ రైతు ప్రతినిధులను తన నివాసంలో కలుసుకున్నారు.
# Tag
Related news
-
గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ భూపాలపల్లి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లభించవని, బలహీన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఆత్మ బీజేపీ నేత అమిత్ షాను ఆవహించిందని, ఆ రెండు పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో గూడు పుఠాణి చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అనామకులకు ఎంపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్ ఎన్నికల్లో కేసీఆర్ను బొంద పెట్టామని, ఇప్పుడు జరిగే ఫైనల్ మ్యాచ్లో తెలంగాణ పౌరుషం గుజరాత్కు తెలిసేలా మోదీని ఓడించాలని ప్రజలను కోరారు. ఫైనల్స్లో మోదీ, అమిత్షాలను ఓడించి, రాహుల్గాం«దీని ప్రధానిని చేసినప్పుడే మనం గెలిచినట్లు అని పేర్కొన్నారు. ‘గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం..’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ శివారు బాలాపూర్, బడంగ్పేట్, సరూర్నగర్లో, మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్లో రోడ్ షో అనంతరం కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు ‘కులగణన చేపట్టి దామాషా ప్రకారం బలహీనవర్గాలకు రిజర్వేషన్లు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటే, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందో మోదీ సమాధానం చెప్పాలి. బీజేపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గద్దె దించుతారు. ప్రధానిగా మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. బండి సంజయ్ కరీంనగర్కు తెచ్చిందేమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప. గుండు అర్వింద్, అరగుండు సంజయ్లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. పదేళ్లలో మోదీ కర్ణాటకకు చెంబు, ఏపీకి పాచిపోయిన లడ్డూలు, మట్టి, నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు..’ అని రేవంత్ ఎద్దేవా చేశారు. మోదీ, షాలకు కర్రుకాల్చి వాత పెట్టాలి ‘మోదీ అన్ని రకాలుగా మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్లను రద్దు చేశారు. ఏటా ఐదు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మోసం చేసినందుకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అదే విధంగా నరేంద్ర మోదీకి, అమిత్షాకు కర్రు కాల్చి వాత పెట్టాలి..’ అని సీఎం అన్నారు. సైనికుల్ని పంపించినా భయపడేది లేదు ‘తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధిస్తుంటే వాటి మూలాలు గుజరాత్లో వెలుగు చూస్తున్నాయి. కేసీఆర్ ఉపన్యాసాన్ని మోదీ నకలు కొట్టారు. నన్ను తిడితే ఏం వస్తుంది? సలహాలు ఇవ్వాల్సింది పోయి అడ్డగోలుగా తిట్టిపోయిండు. కేసీఆర్, కిషన్రెడ్డి కూడా ఇదే పని చేస్తున్నారు. తిట్టడానికి ఇంత దూరం రావలసిన అవసరం లేదు. హైదరాబాద్ మెట్రో రైలుకు నిధులు కేటాయించలేదు. బుల్లెట్ రైలు ఇవ్వలేదు. వరంగల్కు ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్రోడ్డు రాకుండా ప్రధాని అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన నన్ను కేసీఆర్ తరహాలోనే అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కేసీఆర్ బెదిరిస్తేనే భయపడలేదు. తాజాగా మోదీ ఢిల్లీ పోలీసులను పంపాడు. వాళ్లకు భయపడతామా? సైనికుల్ని పంపించినా భయపడేది లేదు. రేవంత్రెడ్డికి జైలు కొత్త కాదు..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం రాముడి అక్షింతలు పంచారు ‘అయోధ్యలో రాముడి కల్యాణానికి 15 రోజుల ముందే రాజకీయం కోసం శ్రీరాముడి అక్షింతలు ఇంటింటా పంచి బీజేపీ అవమానించింది. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్న విషయాన్ని హిందువులందరూ ఆలోచించాలి. మనమందరం హిందువులం కాదా? రామభక్తులం కాదా? అయినా ఓట్ల కోసం హిందుత్వాన్ని ఎప్పుడూ వాడుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ను తీసుకోం ‘బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ను ఓడించేందుకు, బీజేపీని గెలిపించేందుకు పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను కేసీఆర్ పోటీలో నిలిపారు. బీఆర్ఎస్ను ఇండియా కూటమిలోకి తీసుకోం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టింది. కేసీఆర్ మళ్లీ పగటి కలలు కంటున్నాడు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ను దిగిపోవాలంటున్నాడు. నేను ప్రజల మద్దతుతో సీఎం అయ్యా. ఏడాది కాదు..కేసీఆర్? నీ జీవితం మొత్తం ఎదురు చూసినా మళ్లీ నీకు సీఎం పదవి రాదు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సుయాత్ర ఉంది..’ అని సీఎం విమర్శించారు. కొండా రాజ్యసభ సీటు కొనుక్కోవచ్చు ‘మాజీ మంత్రి సబితమ్మ పొద్దున కారు గుర్తు అంటుంది. రాత్రిపూట కమలం గుర్తుకు ప్రచారం చేస్తుంది. సొంత పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టింది. కొండా విశ్వేశ్వర్రెడ్డి రాజకీయాన్ని కూడా ఓ వ్యాపారంగా చూస్తున్నాడు. పదేళ్లు తెలంగాణను మోసం చేసిన మోదీ పక్కన చేరి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. వందల కోట్లు ఉన్న కొండాకు నిజంగానే ప్రజా సేవ చేసే ఆలోచన ఉంటే.. రూ.కోట్లు పెట్టి ఏ రాజ్యసభ సీటో కొనుక్కోవొచ్చు..’ అని రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకా‹Ùరెడ్డి, కేఈఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కరీంనగర్, వరంగల్, చేవెళ్ల పార్టీ అభ్యర్థులు వెలిచాల రాజేందర్రావు, కడియం కావ్య, గడ్డం రంజిత్రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతి జమ్మికుంట (హుజూరాబాద్): జమ్మికుంటలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ (68) వడదెబ్బకు గురై సభలోనే కుప్పకూలింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐలమ్మ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ హామీ ఇచ్చారు. -
సీఎం జిల్లాపై పట్టెవరిది?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరులో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రస్తుత లోక్సభ పోరు కూడా ఆసక్తికరంగానే మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. డీకే.అరుణ (బీజేపీ), చల్లా వంశీచంద్రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్రెడ్డి (బీఆర్ఎస్) నువ్వా..నేనా అన్నట్టుగా గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా అ్రస్తాలు సంధిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి 1952 నుంచి ఇప్పటివరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా.. పదిసార్లు కాంగ్రెస్, మూడు దఫాలు బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్), తెలంగాణ ప్రజాసమితి, జనతాదళ్, జనతా పార్టీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకొని, తిరిగి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతోంది. కాంగ్రెస్: కొడంగల్ స్కీం, ముదిరాజ్లపై ఆశలుమహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏడు పర్యాయాలు పర్యటించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ.4వేల కోట్లతో చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్’పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో అధిక శాతం ఓటర్లుగా ఉన్న ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిన ఆయన.. పాలమూరు ప్రాజెక్ట్కు జాతీయ హోదా తీసుకురాకపోవడం, తగిన నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ, బీఆర్ఎస్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ అంశాలు తమ గెలుపునకు దోహదం చేస్తాయనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే మహబూబ్నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవ ర్గా ల్లోని పలు మండలాల్లో నాయకులు, కేడర్ మధ్య సమన్వయం కొరవడినట్టు తెలుస్తోంది. చేరికల క్రమంలో పాత, కొత్త నేతల మధ్య వైరం ముదిరినట్టు సమాచారం. బీజేపీ: మోదీ చరిష్మా, కేంద్ర పథకాలపై.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ మహిళానేత డీకే.అరుణ రెండోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. ‘విజయ్ సంకల్స్ యాత్ర’పేరుతో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసిన ఆమె.. నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. మోదీ చరిష్మా, కేంద్ర పథకాలు తన గెలుపునకు దో హదం చేస్తాయని బలంగా చెబుతున్న ఆమె.. పాలమూరు ప్రాజెక్టుల సాధనలో తనదే ముఖ్యపాత్ర అని ప్రజల ముందుకు తీసుకెళుతున్నారు. అధికసంఖ్యలో ఉన్న ఎస్సీ సా మాజికవర్గ ఓట్లు తనకు కలిసివస్తాయనే ఆశతో ఉ న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలకు దీటు గా సమాధానం చెబుతూ తనదైన శైలిలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే జితేందర్రెడ్డి, జలంధర్ రెడ్డి వంటి నాయకులు బీజేపీ ని వీడి కాంగ్రెస్లో చేర డం, ఆమెకు కొంత మైనస్గా మారినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్: కేసీఆర్పైనే భారం బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి రెండోసారి బరిలో నిల్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఇతర పార్టీల కంటే ఆలస్యం కాగా.. ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. అయితే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం.. బస్సు యాత్ర ద్వారా మహబూబ్నగర్లో నిర్వహించిన భారీ రోడ్షో, కార్నర్ మీటింగ్కు పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో ‘గులాబీ’శ్రేణుల్లో జోష్ నెలకొంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని..అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చతికిలపడిందంటూ తనదైన పంథాలో విమర్శలు గుప్పిస్తూనే..ఈ పార్లమెంట్ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు టార్గెట్గా ప్రసంగించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొందని.. అందరూ కృషి చేస్తే మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు తథ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.ప్రభావం చూపే అంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా అచ్చంపేట–తాండూరు, కృష్ణా–వికారాబాద్ రైల్వే లేన్ పెండింగ్ గద్వాల–మాచర్ల లేన్కు అడుగులు పడకపోవడం నారాయణపేటకు మంజూరైన సైనిక్ స్కూల్ తరలిపోవడంపై నిరసన గద్వాల, నారాయణపేటలో చేనేతలకు టెక్స్టైల్ పార్కు ఏర్పాటు డీకే అరుణ (బీజేపీ)వంశీచంద్రెడ్డి (కాంగ్రెస్) శ్రీనివాస్రెడ్డి (బీఆర్ఎస్) 2019 ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు.. టీఆర్ఎస్ – మన్నె శ్రీనివాస్రెడ్డి4,11,402 (41.78 శాతం)బీజేపీ – డీకే అరుణ3,33,573 (33.88 శాతం)కాంగ్రెస్ – చల్లా వంశీచంద్రెడ్డి1,93,631 (19.67 శాతం) -
మోదీ సభతో బీజేపీలో జోష్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న బీజేపీలో ప్రధాని మోదీ బహిరంగసభ నూతనోత్సాహాన్ని నింపింది. ఈ సభ లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనడం, మోదీ ప్రసంగం సందర్భంగా కరతాళధ్వనులు, నినాదాలతో హోరెత్తించడం పార్టీ కేడర్లో హుషారు తెచ్చింది. ఈ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టదంటూ మోదీ తన ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు. మంగళవారం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గ్లో నిర్వహించిన సభ సక్సెస్ కావడం పట్ల పార్టీ ముఖ్యనేతలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ను, మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎం.రఘునందన్రావును గెలిపించాలంటూ మోదీ కోరడంతోపాటు, ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్రంలోని తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడంపై ప్రజల్లో మంచి స్పందన కనిపించింది, మళ్లీ మే 8న వేములవాడలో, మే 10న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభల్లో మోదీ పాల్గొననున్నారు. నేడు అమిత్షా రోడ్షో... బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా బుధవారం హైదరాబాద్ లోక్సభ పరిధిలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్టులో దిగుతారు. ఆ తర్వాత పాతబస్తీ లాల్దర్వాజ మహంకాళి ఆలయం నుంచి అక్కడికి దగ్గరలోని సుధ టాకీస్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాల్లో పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తారు. -
ప్రాంతీయ శక్తులే..ప్రజాస్వామ్య పరిరక్షకులు
(కల్వల మల్లికార్జున్రెడ్డి) ‘లోక్సభ ఎన్నికల పోరు ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ నడుమ కాకుండా ప్రాంతీయ శక్తులతోనే జరుగుతోంది. ప్రాంతీయ శక్తులే ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ప్రాంతీయ పార్టీలే. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా అడ్డుకొనే శక్తి జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి లేదు. బీజేపీకి అడ్డుకట్ట వేసేది ప్రాంతీయ శక్తులే’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. దేశంలో పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే తప్ప 28 రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకున్న జాతీయ పార్టీలే లేవన్నారు. బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, వైఎస్సార్సీపీ, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి స్థానం లేకుండా పోయిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలించిన కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ కుట్రలను ఆ పార్టీ అడ్డుకోలేక పోయిందని విశ్లేషించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్ను యూటీ చేసే కుట్ర ‘హైదరాబాద్పై పట్టు చేజిక్కించుకోవడంతోపాటు బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్సభలో మూడింట రెండొంతుల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు చేస్తోంది. వీటిని అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ వంటి సమాఖ్య స్ఫూర్తిగల ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వస్తేనే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతుంది. కేసీఆర్, వైఎస్ జగన్, స్టాలిన్, పినరయి విజయన్ వంటి ప్రాంతీయ శక్తులు గట్టిగా గొంతు విప్పితే కేంద్రాన్ని శాసించడంతోపాటు దక్షిణాదిని రక్షించుకోవచ్చు. రూ. వేల కోట్ల స్కాంలు చేసినా బీజేపీలో చేరగానే క్లీన్చిట్ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా ‘ఉంటే జేబులో ఉండు.. లేదంటే జైల్లో ఉండు’అనేలా వ్యవహరిస్తున్నాయి. జగన్పై కేసులు, జైల్లో పెట్టినా ప్రజల వద్దకు వెళ్లి తీర్పు కోరారు. ప్రజల్లో బలంగా ఉండే నాయకుడిని ముట్టుకొనేందుకు ఏ ఏజెన్సీ అయినా భయపడాల్సిందే.వివిధ అభియోగాలు ఎదుర్కొంటున్న 25 మంది నేతలు బీజేపీలో చేరగానే క్లీన్చిట్ వచ్చింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్, అజిత్ పవార్ రూ. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినా మోదీతో చేతులు కలిపిన వెంటనే వారికి క్లీన్చిట్ లభించింది.3 వేల మందికిపైగా మహిళలను లైంగికంగా వేధించిన జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ బీజేపీ సహకారం లేకుండా దేశం దాటాడా? రూ. 100 కోట్ల కుంభకోణం అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను జైల్లో పెట్టారు. ఇదే ఆరోపణలపై అరెస్టు అయిన మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. బీజేపీలో చేరితే కడిగిన ముత్యాలు అవుతారా? ఈ అరాచకాలను ప్రజాశక్తితోనే ఎదుర్కొంటాం. షర్మిలను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే మోదీ 2014లో, రేవంత్రెడ్డి 2023లో ప్రజలకు రంగుల కల చూపి అధికారంలోకి వచ్చారు. ప్రజలను ఊహల పల్లకిలో కూర్చోబెట్టడంతోపాటు కేసీఆర్ను దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు అనేక శక్తులను వాడారు. వై.ఎస్. షర్మిలను తెలంగాణలో ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణలో కేసీఆర్ను బదనాం చేయడం, వై.ఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులను బీఆర్ఎస్కు దూరం చేసేందుకు షర్మిలను ఉపయోగించుకున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించి తిట్టించింది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ పని కాగానే షర్మిలను ఆంధ్రాలో ప్రయోగిస్తున్నారు. షర్మిలతో అక్కడా అదే ప్రయోగం చేయడం కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగం. కాంగ్రెస్ నేతలే కూల్చుతారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అసవరం లేదు. రేవంత్ చుట్టూ కాంగ్రెస్కు చెందిన ఖమ్మం, నల్లగొండ బాంబులు ఉన్నాయి. ప్రజలు 10–12 ఎంపీ సీట్లు మాకు ఇస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను తిరిగి కేసీఆర్ శాసించే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్, భద్రాచలంలో ఉప ఎన్నిక ఖాయం. కాంగ్రెస్ ప్రతిష్ట క్షేత్రస్థాయిలో దిగజా రుతోంది. ‘ఆర్ ట్యాక్స్ కడితేనే భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయి. ఢిల్లీకి డబ్బు సంచులు పంపేందుకు బిల్డర్లు, రైస్మిల్లర్లను బెదిరిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో వికృత ధోరణి రేవంత్రెడ్డి సీఎం పదవికి తగని చిల్లరగాడు. ఆయనవి చిల్లర మాటలు, ఉద్దెర పనులు. రేవంత్ ప్రసంగాలను కుటుంబంతో కూర్చుని చూడలేని పరిస్థితి. ప్రజలను చిరకాలం ప్రజలను భ్రమల్లో పెట్టవచ్చని అనుకుంటున్నాడు. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన మూడు పిల్లర్లను ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయట్లేదు. కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగా బదనాం చేసేందుకే పంటల ను ఎండబెట్టారు. డిసెంబర్ 3న కేసీఆర్ తిరిగి సీఎం అయ్యుంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసి పంటలను కాపాడేవారు.కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసిందిఇతర పార్టీల నుంచి చేరిన కొందరిని పూర్తిగా చదవకుండానే పదవులు ఇచ్చాం. కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసింది. పార్టీని వీడిన కడియం, రంజిత్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, దానం నాగేందర్ వంటి వారిపై బీఆర్ఎస్ కేడర్ కసితో ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ద్రోహులను దగ్గరకు తీయకుండా గుణపాఠం నేర్పుతాం. లోక్సభ ఎన్నికల్లో సామాజిక సమతూకం పాటించి రిజర్వుడ్ స్థానాల్లోనూ ఉద్దండులను బరిలోకి దించాం. కనీసం 10–12 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం ఉంది.రెఫరెండం ప్రకటనకు కట్టుబడి ఉండాలి మాట ఇచ్చి తప్పడం రేవంత్కు అలవాటు. కొడంగల్లో రాజకీయ సన్యాసమని మల్కాజిగిరిలో పోటీ చేశాడు. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అంటున్న రేవంత్ కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు రాకుంటే పదవి నుంచి తప్పుకుంటారా? జిల్లాల సంఖ్య తగ్గిస్తామని రేవంత్ అనడం తుగ్లక్ పని. 33 జిల్లాల్లో ఒక్కటి టచ్ చేసినా తెలంగాణ తిరగబడుతుంది.జగన్ మళ్లీ గెలుస్తారు గుంటూరులో ఇంటర్ చదివా. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న దానిని బట్టి ఏపీలో వై.ఎస్. జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. జగన్ మళ్లీ గెలిచి వస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బీఆర్ఎస్, వైసీపీ, జేడీఎస్ వంటి 13 పార్టీలు కూటముల రూపురేఖలను మార్చేస్తాయి. కాంగ్రెస్ను వెంటాడతాంకేసీఆర్ సీఎంగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ను వెంటాడుతాం. ఏడు పదుల వయసులో మేజర్ సర్జరీ జరిగినా.. కర్ర సాయంతో నడుస్తూ, కూతురు జైల్లో ఉన్నా, ఎర్రటి ఎండలున్నా, నమ్ముకున్న నాయకులు పార్టీని వీడుతున్నా, రేవంత్ పరుషంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు సాంత్వన చేకూరేలా కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. -
ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీ, ఈడీలను పంపించు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నేడు తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి వసూళ్లు మొదలెట్టాడని ప్రధాని మోదీ అన్నారని..అవినీతి జరిగిందని తెలిస్తే ఐటీ, ఈడీలను రంగంలోకి దించాలి కానీ ఉత్త ఆరోపణలు చేయడం ఎందుకని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన రోడ్షోలో ఆయన ప్రసంగించారు. చోటేభాయ్, బడేభాయ్ ఇద్దరూ ఒక్కటేనని, బయటకు మాత్రం వేర్వేరు అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీరికి ఓటేస్తే గోదావరి నీళ్లు మనకు దక్కవని, మోటర్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు. ఈ రెండు పార్టీ లకు ఓటేస్తే గోదావరిలో పడేసినట్టేనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న గోదావరి నీటిని తమిళనాడుకు తరలించుకుపోయేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ కట్టి ఈ నీటిని ఎత్తుకుపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. మన బతుకుదెరువు, మన జీవన్మరణ సమస్య అయిన గోదావరి నీటిని తీసుకుపోతాం అంటుంటే ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కొత్తగూడెం జిల్లా ఉండాలా? వద్దా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత రాష్ట్రాన్ని అంధకారం చేస్తోందని విమర్శించారు. కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈ జిల్లా ఉండాలా? వద్దా ? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు రూ.10వేలు అందిస్తే కాంగ్రెస్ పార్టీ రూ.15,000 ఇస్తామని చెప్పిందని, కల్యాణలక్ష్మి ద్వారా తాము ఆర్థికసాయం అందిస్తే, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ఎన్నికల హామీలో రూ. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, మరి ఈ రోజు ఎంతమందికి రైతుబంధు అందింది, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, రుణమాఫీ ఎంత అమలు చేశారు.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ప్రాంతాల్లో త్రీఫేస్ కరెంట్ ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోతున్నాయన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ కాటకలిసిందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో కలుíÙత ఆహారం తిని భువనగిరిలో ఓ విద్యార్థి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిపై కుట్రలు చేస్తారు కేంద్రంలో అధికారంలో ఉన్న బడేభాయ్ ఆదేశాల మేరకు ఇక్కడి చోటే భాయ్ సింగరేణి మీద కుట్రలు చేసే ప్రమాదం ఉందని కేసీఆర్ హెచ్చరించారు. గతంలో ఆ్రస్టేలియా నుంచి అదాని దిగుమతి చేసుకున్న బొగ్గు కొనాలంటూ ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి చేసినా ‘మాకు సింగరేణి బొగ్గు ఉంది.అదాని బొగ్గు అవసరం లేదు. ఒక్క టన్ను కూడా కొనను’అంటూ తెగేసి చెప్పానని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆదేశిస్తే.. నా తలకాయ తెగిపడ్డా మోటార్లకు మీటర్లు పెట్టనంటూ రైతుల ప్రయోజనాలు కాపాడిన చరిత్ర తనకు ఉందన్నారు. మత విద్వేషాలు రేపుతున్నారు.. తెలంగాణలో మత సామరస్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. తమ హయాంలో ఏ ఒక్కరోజూ మత కలహాలు జరగలేదని గుర్తు చేశారు. కానీ ఈ రోజు హిందూ, ముస్లిం అంటూ విద్వేషాలు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ అంత దరిద్రమైన పాల న చేసిన మరో నేత లేడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య పంచాయితీలు పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప మరేం లేదన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే నిధులు.. గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కాలన్నా, కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావాలన్నా, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టొద్దన్నా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కేసీఆర్ కోరారు.ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత గెలిస్తేనే ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించానన్నారు. ‘జబ్తక్ తెలంగాణా మే కేసీఆర్ హై, తబ్తక్ సెక్యులర్ రియాసత్ రహేగా’అంటూ మైనారిటీలకు హామీ ఇచ్చారు.
Related News by category
-
వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. వేసవిలో శునకాలు రెచ్చిపోతుండటాన్ని మనం చూస్తుంటాం. అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.మనుషులకు మాదిరిగానే చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం మొదలైనవి కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం కుక్కలు చల్లని వాతావరణంలో ఉదాశీనంగా ఉంటాయి. అయితే వేసవికాలం రాగానే అవి హైపర్ యాక్టివ్గా మారిపోతాయి. వేసవిలో కుక్కలు మరింత దూకుడుగా మారుతాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది.అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోస్ ఆర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవి కాలంలో శునకాలు మరింత వేడి అనుభూతికి లోనవుతాయి. వేసవికాలం మనుషులకు మించి శునకాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధిక వేడి లేదా ఉష్ణోగ్రత శునకాలలోని థర్మోగ్రూలేషన్ను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కుక్కలు వేడిని తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితిలో కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి.వేసవి కాలంలో కుక్కలలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుందని పెన్ స్టేట్ యూనివర్శిటీ ఒక పరిశోధనలో కనుగొంది. దీని కారణంగా అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. ఈ సమయంలో కుక్కలు ఆకస్మికంగా మొరగడం, మనుషులను చుట్టుముట్టడం, కరవడం, పరిగెత్తడం లాంటి చర్యలను చేస్తాయి.వేసవిలో పెంపుడు శునకాలు లేదా వీధి కుక్కలు ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవి ఎప్పుడూ నీరసంగా పడుకున్నట్లు కనిపిస్తే, అవి వడ దెబ్బకు గురయ్యాయని గుర్తించాలి. అటువంటి స్థితిలో వాటికి వైద్య సహాయం అందించాలి. -
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
ఉత్తరాఖండ్లోని కుమావోన్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.బాంబీ బకెట్ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్తో మెటల్ ఫ్రేమ్తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి. -
శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
రైలు ఎక్కేటప్పుడు.. దిగెటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు కదులుతుంటే పట్టాలు, ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కొని కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. మరికొంత మంది అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( ఆర్పీఎఫ్) పోలీసుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నవారు ఉన్నారు. అటువంటి ఘటనే ఒకటి హరిద్వార్లో చోటుచేసుకుంది. ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైలు కింది పడిన వ్యక్తిని సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే... ఉత్తరాఖండ్ హరిద్వార్కు సమీపంలోని లక్సర్ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు ఆహారం కోసం రైలు దిగాడు. అతను దిగిన రైలు కదలటంతో పరుగుపెట్టి మరీ ఎక్కడానికి ప్రయిత్నించాడు. కానీ, రైలు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా డోర్ వద్ద అదుపుతప్పి రైలు పట్టాలు, ప్లాట్ మధ్యలో పడిపోయాడు. అప్పటికే రైలు కదులుతోంది. ప్రయాణికుడు రైలు కింద పడినట్లు శబ్దంతో రావటంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే వచ్చి.. ముందుగా ఆ ప్రయాణికుడి తలను ప్లాట్పైకి లాగింది. వెంటనే రైలును అత్యవసరంగా ఆపారు. తర్వాత ఆ ప్రయాణికుడిని ప్లాట్ఫామ్కి లాగారు. క్షణాలో సమయస్ఫూర్తితో స్పందించిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడిని రక్షించి కానిస్టేబుల్ కే. సుమతి రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని కాపాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #viralvideo At Haridwar's Laksar railway station a passenger carrying food items from the railway station boarded the Calcutta-Jammutvi Express During this, his foot slipped and he got stuck between the train and the platform Woman constable Uma pulled him out safely#Uttarakhand pic.twitter.com/BvfnMqlPtQ— Siraj Noorani (@sirajnoorani) April 28, 2024 -
కేంద్ర వ్యవసాయ మంత్రిగా మాజీ సీఎం? ప్రధాని మోదీ లేఖలో స్పష్టం?
గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, శివరాజ్సింగ్ చౌహాన్ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల శివరాజ్సింగ్ చౌహాన్కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇటువంటి వార్తలకు కారణంగా నిలుస్తోంది. ‘దేశంలోని వ్యవసాయరంగంలో మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ.. శివరాజ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయని కూడా మోదీ ఆ లేఖలో శివరాజ్ను ప్రశంసించారు.ప్రధాని మోదీ మాజీ సీఎం శివరాజ్ సింగ్కు రాసిన లేఖలో ‘మీకు విద్యార్థి రాజకీయాలలో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పదవీకాలంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మీరు రాష్ట్రంలో సానుకూల అభివృద్ధిని తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలు, యువత సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మిమ్మల్ని ‘మామాజీ’ అని పిలుస్తూ, గౌరవిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం నూతన మార్గాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేపట్టారు. వ్యవసాయంలో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేశారు. విదిశ నుండి మీరు వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడం అనేది ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. త్వరలో మీరు పార్లమెంటుకు చేరుకుంటారని, కొత్త ప్రభుత్వంలో మనమందరం కలిసి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
Advertisement