మతపరమైన చీలికలను రెచ్చగొడుతున్నారు: సోనియా ధ్వజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ .. నరేంద్రమోదీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. మతపర చీలకను రెచ్చగొడుతూ ప్రజల్లో భయం, విపత్తు పొంచివుందన్న ఆందోళన పూరిత వాతావరణం నెలకొల్పుతూ ప్రమాదకరమైన మాయా క్రీడ నడుపుతోందని ధ్వజమెత్తారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సంక్షేమ రాజ్య నిర్మాణాన్ని ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందన్నారు.
భూసేకరణ బిల్లు, ఆహార భద్రత చట్టం విషయంలో ప్రభుత్వ చర్యలను బలంగా వ్యతిరేకించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారమిక్కడ జరిగిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సదస్సులో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత జరుగుతున్న ఆ పార్టీ సీఎంల తొలి సదస్సు ఇది. సోనియా ప్రసంగంలోని
ముఖ్యాంశాలు...
‘‘ప్రధాని.. ఒకవైపు సుపరిపాలనలో, రాజ్యాంగ విలువల విషయంలో తానే విజేతనని తనను తాను చూపుకోవాలనుకుంటారు. మరోవైపు.. తన సహచరులు చాలా మంది దుష్ట ప్రకటనలు చేయటానికి, మతపరమైన చీలికను రెచ్చగొట్టటానికి అనుమతిస్తారు. ఇది ఇప్పటికే మన లౌకిక నిర్మాణాన్ని దెబ్బతీసింది. భయం, విపత్తు పొంచివుందన్న ఆందోళనకర వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారు.
⇒ అధికారం, పెత్తనం అంతా అసాధారణంగా కేంద్రీకృతం చేయటం జరుగుతోంది. పార్లమెంటరీ పద్ధతులను ఉద్దేశపూర్వకంగా అతిక్రమించటం, న్యాయవ్యవస్థకు హెచ్చరికలు మోదీ పాలన గుర్తులుగా ఉన్నాయి.
⇒ ఆహార భద్రత చట్టం వర్తించే ప్రజల సంఖ్యను 67 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన ఆందోళనకరం.
⇒ ప్రణాళికాసంఘం రద్దు 11 ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు గట్టి దెబ్బ. వాటిలో ఏడు రాష్ట్రాల సీఎంలు ఈ సదస్సులో ఉన్నారు. రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇచ్చే ముసుగులో వాటిపై కేంద్రం అదనపు భారం మోపింది. కార్పొరేట్ సంస్థలకు మాత్రం భారీ పన్ను మినహాయింపులిచ్చింది.
⇒ అంతర్గత రాజకీయాలను విదేశాల్లో వినిపించటం మోదీ కొత్తగా మొదలుపెట్టారు. ఆయన ప్రకటనల్లో గొప్పలు చెప్పుకోవటం, పచ్చి అబద్ధాలే ఉన్నాయి.
⇒ జీఎస్టీ, యూఐడీ వంటి కీలకమైన అంశాలపై ఇంతకుముందు విమర్శలు చేసిన ప్రధాని ఇప్పుడు వాటి విలువలను గుర్తించినట్లున్నారు. కానీ.. భూసేకరణ, ఆహార భద్రత చట్టం వంటి ఇతర అంశాల్లో ఆయన తిరోగమనాన్ని వ్యతిరేకించాలి.
⇒ యూపీఏ హయాం నాటి పేద ప్రజల అనుకూల విధానాలను ఎన్డీఏ పలచబారుస్తోందని వివరించటమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్ర మేనిఫెస్టోల అమలు గురించి ప్రజలకు చెప్పటమూ ముఖ్యం.
⇒ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు అందించే ఉత్తమ నివాళి అవుతుంది.
ఉత్తమ పాలనగా చూపాలి: రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలోని ప్రతి రాష్ట్రమూ.. సమూలంగా మార్చివేసే రెండు లేదా మూడు పథకాలపై దృష్టి కేంద్రీకరించాలని, వాటిని దేశంలోనే ఉత్తమంగా మలచాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ పాలనలో ఉన్న 9 రాష్ట్రాలు దేశంలో ఉత్తమ పాలనలో ఉన్న రాష్ట్రాలుగా మనం చూపాలి’’ అని సీఎంలకు సూచించారు.
మోదీ నాకన్నా మంచి సేల్స్మన్: మన్మోహన్
బలహీన రాష్ట్రాలు, అత్యంత పేద ప్రాంతాలకు సహాయపడిన ప్రణాళికాసంఘాన్ని తొందరపాటుతో రద్దు చేశారని మోదీ ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని మన్మో హన్సింగ్ తప్పుపట్టారు. కాంగ్రెస్ సీఎం ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తన తర్వాత ప్రధాని పదవి చేపట్టిన నరేంద్రమోదీ తనకన్నా మంచి ‘సేల్స్మన్’, ఈవెంట్ మేనేజర్ అని, తనకన్నా మంచిగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో జీఎస్టీ బిల్లు వంటి వాటిని అడ్డుకున్న బీజేపీ.. ఇప్పుడు అదే జీఎస్టీని తెచ్చే విషయంలో తామే గొప్ప విజేతలమని చెబుతోందన్నారు.
మోదీ పాలనలో భయంభయం
Published Wed, Jun 10 2015 4:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement