బీజింగ్: చైనా చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన, సుమారు మూడు దశాబ్దాల నాటి తియానన్మెన్ ఘటనలో మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగుచూశాయి. ప్రశాంతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు, విద్యార్థులపై చైనా సాయుధ బలగాలు ఉక్కుపాదం మోపడంతో మృతిచెందిన వారి సంఖ్య 10 వేలకు పైనే ఉంటుందని బ్రిటన్ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల్లో వెల్లడైంది. అప్పటి బ్రిటన్ రాయబారి అలన్ డొనాల్డ్ టెలిగ్రామ్ ద్వారా ఈ సమాచారాన్ని స్వదేశానికి చేరవేశారు. 1989 జూన్ 3, 4 మధ్య రాత్రి ఈ ఘటన జరగ్గా డొనాల్డ్ ఒక్కరోజు తరువాత అంటే జూన్ 5న ఈ టెలిగ్రామ్ పంపినట్లు తెలిసింది. ఉద్యమకారులపై సాయుధ బలగాలు పాల్పడిన హింసను డొనాల్డ్ తన టెలిగ్రామ్లో క్లుప్తంగా వివరించారు. ఈ ఘటనలో సుమారు వేయి మంది దాకా చనిపోయి ఉంటారని ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు.
షూట్ చేసి ట్యాంకులతో తొక్కించి..
‘తియానన్మెన్ స్క్వేర్ వద్ద అప్పటికే వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేయడానికి చైనా సాయుధ బలగాలు బీజింగ్ చేరుకున్నాయి. ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి తమకు గంట సమయం ఇస్తారని ఆందోళనకారులు భావించారు. కానీ ఐదు నిమిషాల్లోనే పౌరులు, విధులు నిర్వర్తిస్తున్న సైనికులు అనే తేడా లేకుండా సాయుధ దళాలు ఏపీసీ(ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్) నుంచే కాల్పులు జరిపాయి. తరువాత మృతదేహాల మీదుగా పోనిచ్చి ఛిద్రం చేశారు. వారి శరీర అవశేషాలను ఆ తరువాత బుల్డోజర్లతో తరలించి కాల్చివేశారు’ అని డొనాల్డ్ నాటి భయానక విషయాలను కళ్లకు కట్టారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడి ద్వారా ఈ సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. దీంతో చైనా ఇంతకాలం ఈ చీకటి ఘటనపై చెబుతున్నదంతా అబద్ధమని తేలిపోయింది. ఆందోళనకారుల అణచివేత సందర్భంగా సుమారు 200 మంది పౌరులు, పోలీసులు, సైనికులు చనిపోయారని ఆ ఏడాది జూన్ చివరన చైనా ప్రకటించింది. డొనాల్డ్ వెల్లడించిన సమాచారం విశ్వసించదగినదేనని, ఇటీవల అమెరికా బహిర్గతం చేసిన పత్రాల్లోనూ ఇలాంటి అంశాలున్నాయని హాంకాంగ్ బాప్టిస్టు వర్సిటీ ప్రొఫెసర్ పియరీ కాబెస్టాన అన్నారు.
‘తియానన్మెన్’ మృతులు 10 వేల పైనే!
Published Sun, Dec 24 2017 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement