వైఎస్ఆర్ లేని లోటు రెండు రాష్ట్రాల్లో కనిపిస్తోంది | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ లేని లోటు రెండు రాష్ట్రాల్లో కనిపిస్తోంది

Published Wed, Sep 2 2015 9:05 AM

YSRCP Leaders pay tribute to ys rajasekhara reddy in lotus pond

హైదరాబాద్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఆ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ 6వ వర్థంతి జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు వైఎస్ఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన ఘనత ఆ మహానేత వైఎస్ఆర్ది అన్నారు. పేద ప్రజలకు మేలు చేసేలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబంలో సభ్యుడిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని తిరిగి యాథాస్థానంలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement