Sakshi News home page

పని చేస్తే మరోసారి ఛాన్స్ ఇస్తాం: అసద్

Published Sat, Feb 6 2016 3:58 PM

పని చేస్తే మరోసారి ఛాన్స్ ఇస్తాం: అసద్ - Sakshi

హైదరాబాద్: నగరంలోని దారుసలాం ఎమ్ఐఎం పార్టీ కార్యాలయంలో శనివారం కార్పొరేట్లతో మజ్లీస్ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో అసదుద్దీన్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు సమర్ధవంతంగా పనిచేస్తే మరోసారి అవకాశం ఇస్తామని వెల్లడించారు.

అవినీతి అక్రమాలకు పాల్పడితే ఐదేళ్లు కాకముందే పదవి కోల్పోతారని హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా కృషి చేయాలని కార్పొరేట్లకు అసదుద్దీన్ సూచించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐంఎ 44 డివిజన్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement