మీడియాకు నోటీసులు: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

మీడియాకు నోటీసులు: చంద్రబాబు

Published Sat, Dec 19 2015 8:02 AM

మీడియాకు నోటీసులు: చంద్రబాబు - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై వార్త కథనాలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలకు, ప్రచురించిన వార్తపత్రికలకు నోటీసులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలిపారు. వాస్తవాలు ఏమిటో తెలుసుకునేందుకు, వారివద్ద ఏమైనా ఆధారాలుంటే తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. సెక్స్ రాకెట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఎవరితోనైనా ఫొటోలు దిగినంత మాత్రాన వారితో సంబంధం ఉన్నట్టు కాదన్నారు.

 

తమ వద్ద ఉన్న సమాచారం మొత్తం సభ ముందుంచామని, విపక్ష నేత వద్ద ఇంకేమైనా ఆధారాలుంటే, ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఈ అంశాన్ని పక్కదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. తనతో విదేశాలకు వచ్చిన నిందితుడు త్వరలోనే పోలీసులకు లొంగిపోతాడని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఎమ్మెల్యే బోడెప్రసాద్ అన్నారు.

Advertisement
Advertisement