విజయసాయిరెడ్డికి రాజ్యసభ అభ్యర్థిత్వంపై హర్షం | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డికి రాజ్యసభ అభ్యర్థిత్వంపై హర్షం

Published Fri, May 27 2016 1:15 AM

విజయసాయిరెడ్డికి   రాజ్యసభ అభ్యర్థిత్వంపై హర్షం - Sakshi

తార్నాక: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల   ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్  హర్షం వ్యక్తం చేశారు. గురువారం తార్నాకలో విలేకరులతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డికి  అవకాశం కల్పించి కార్యకర్తలకు సముచితమైన గౌరవం ఇచ్చారన్నారు. 

పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఆయన  పార్టీ వాణిని బలంగా  వినిపిస్తూ పార్టీ పటిష్టతకు తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement