మాదాపూర్: మాదాపూర్లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక(14) బాత్రూమ్లో ప్రసవించిన ఘటనలో ఆమె అక్క అరుణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక అక్క అరుణే ఈ దారుణానికి కారణమని మాదాపూర్ ఎస్ఐ అక్రమ్బాబా తెలిపారు. అరుణ వ్యసనాలకు బానిసై, డబ్బు కోసం తన చెల్లితో ఇలాంటి తప్పుడు పనులను చేయించినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. అందుకు అరుణపై చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. అరుణ ఇచ్చిన అలుసుతోనే ధనుష్ అనే వ్యక్తి బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఉదంతంపై రంగారెడ్డి జిల్లా డీఈఓ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవలింగంను సస్పెండ్ చేశారు. ఏడుగురు ఉపాధ్యాయులకు మెమోలు జారీచేశారు. ఆయన సోమవారం పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ విషయంలో పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. మహిళా టీచర్లు ఇంతమంది ఉండి కూడా బాలిక గర్భం ధరించిన విషయాన్ని కనిపెట్టలేకపోవడం ఏంటని డిప్యూటీ డీఈఓ ఉషారాణి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాఠశాలను సందర్శించారు. బాలిక ప్రసవం ఘటనపై విద్యార్థులను, ఉపాధ్యాయులను విచారించారు. సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. కాగా ప్రసవించిన బాలికను మాదాపూర్ పోలీసులు పాఠశాలకు రప్పించారు. అయితే బాలిక ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతోంది. తన గర్భానికి కారకులెవరో వెల్లడించలేదు.
సుమోటోగా కేసు స్వీకరణ...
మాదాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక బడిలోనే పాపకు జన్మనిచ్చిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక ఘటనకు సంబంధించి పూర్వపరాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
'ఈ దారుణానికి అక్కే కారణం'
Published Tue, Dec 1 2015 10:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement