కేన్సర్కు సమర్థమైన చికిత్స కనుక్కునే విషయంలో శాస్త్రవేత్తలు ఇంకో ముందడుగు వేశారు. శరీర రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తూనే ప్రత్యేకంగా డిజైన్ చేసిన వైరస్లను ఉపయోగించడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధికి చెక్ పెట్టవచ్చునని టెక్సాస్, ఒహాయో స్టేట్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన అధ్యయనం చెబుతోంది. ఇలా చేయడం ప్రయోజనకారి కానేకాదన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. ఎందుకంటే.. రోగ నిరోధక వ్యవస్థలో సహజసిద్ధంగా కేన్సర్ను ఎదుర్కోగల సామర్థ్యమున్న ఎన్కే కణాలు వైరస్పై దాడులు చేసేందుకు పరిమితమవుతాయని అనుకునేవారు. అయితే తాజా పరిశోధనలు దీనికి భిన్నమైన ఫలితాలిచ్చాయి.
తగినన్ని ఎన్కే కణాలను శరీరం వెలుపలి నుంచి ప్రవేశపెట్టినప్పుడు అవి కేన్సర్ కణతులను నాశనం చేయడంతోపాటు కణాలు ఇతర అవయవాలకు విస్తరించకుండా కూడా అడ్డుకున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త బల్వీన్ కౌర్ తెలిపారు. ఎన్కే కణాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే కేన్సర్ కణాల మరణం కూడా అంతే వేగంగా జరుగుతున్నట్లు బల్వీన్ సైద్ధాంతికంగానే కాకుండా.. ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా కూడా నిర్ధారించుకున్నారు. ఒకవైపు నుంచి కేన్సర్ను చంపేయగల వైరస్లు దాడి చేస్తూంటే.. ఇంకోవైపు ఎన్కే కణాలు కూడా అదే పనిచేస్తూంటాయన్నమాట. కేన్సర్పై పోరుకు ఇది సరికొత్త ఆయుధమని.. మరిన్ని పరిశోధనలు నిర్వహించి మానవులపై కూడా ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని బల్వీన్ చెప్పారు.
ఆ రెండూ కలిస్తే.. కేన్సర్ పరార్!
Published Mon, Apr 30 2018 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement