సాక్షి ప్రతినిధి, కర్నూలు: సార్వత్రిక సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. విభేదాలతో తెలుగుదేశం పార్టీ కుదేలవుతోంది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చతికిల పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి విడతలోనే జిల్లాలోని అభ్యర్థులను ప్రకటించారు. జాబితా ప్రకటించిన రోజే జననేత డోన్, పత్తికొండ, ఆలూరు నియోజక వర్గాల్లో పర్యటించారు. దీంతో జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది.
వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. మూడు విడతలుగా జాబితా ప్రకటించినా ఇంకా కర్నూలు పార్లమెంట్, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ కేడర్లో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో అసంతృప్తి నాయకులు కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మరికొందరు ఏకంగా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నంద్యాలకు చెందిన టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జ్ ఎన్హెచ్ భాస్కర్రెడ్డి, ఆయన సోదరుడు ఎన్హెచ్ ప్రసాద్రెడ్డి సోమవారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
అదేవిధంగా గోపవరం కుటుంబ సభ్యులు నాగిరెడ్డి, నాగేంద్రప్రసాద్రెడ్డి, సాయినాథ్రెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదోనికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పంపాపతి, ఆయన సోదరుడు ఉమాపతి జననేత ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కర్నూలుకు చెందిన సుబ్రమణ్యం ఇటీవల పార్టీలో చేరారు. ఆలూరు నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్లు 12 మంది ఇటీవల బుట్టా రేణుక ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి మారెప్ప సోదరుడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మూలింటి బాలకృష్ణ ఇటీవలే పార్టీలో చేరారు.
అదే విధంగా టీజీ వెంకటేష్ ప్రధాన అనుచరుడు తిమ్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ గిరిజారెడ్డి, కట్టమంచి విద్యాసంస్థల అధినేత జనార్దన్రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకుడు స్టార్ మోటార్స్ అధినేత అయూబ్ఖాన్, న్యాయవాది జాఫర్, ఆంధ్ర కిచెన్ ప్రొప్రైటర్ నిజాం, ఫైజన్, పీసీసీ కార్యదర్శి సత్యం యాదవ్ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు మున్సిపల్ మాజీ చైర్మన్ దావూద్ ఖాన్ కుమారుడు ఇలాయాస్ ఖాన్, కాంగ్రెస్ లీగల్ సెల్ చెర్మైన్ రామకృష్ణారెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు. చేరికలతో వైఎస్సార్సీపీకి రోజు రోజుకూ బలం పెరుగుతోంది.
రగిలిపోతున్న అసంతృప్తులు..
టీడీపీలో రోజు రోజుకు అసంతృప్తులు పెరిగిపోతున్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్ అధినేత బాబుపై గుర్రుగా ఉన్నారు. పాణ్యంలో ఎవరూ జెండా మోయని సమయంలో టీడీపీ బాధ్యతలు స్వీకరించిన కేజే రెడ్డిని కాదని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఏరాసు ప్రతాప్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో కేజే రెడ్డి, అతని అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నందికొట్కూరు టికెట్ కోసం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన విక్టర్ను కాదని తాజాగా పార్టీలో చేరిన లబ్బి వెంకటస్వామికి కట్టబెట్టడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అదే విధంగా మంత్రాలయం, ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థులను తేల్చకపోవటంతో కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ పొత్తులో భాగంగా కోడుమూరు అసెంబ్లీ స్థానాన్ని కమలదళానికి కట్టబెట్టటంపైనా తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధినేత రెండు కళ్ల సిద్ధాంతాన్ని అభ్యర్థుల ఖరారులోనూ పాటిస్తుండటంతో తమ్ముళ్లు మండిపడుతున్నారు. ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారిని నట్టేటముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పితీరుతామని హెచ్చరిస్తున్నారు.
వైఎస్సార్సీపీలో జోష్!
Published Wed, Apr 16 2014 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement