మహిళలు, రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విరివిగా రుణాలు అందించారని, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించారని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నా మె.. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురంలో సోమవారం ఉదయం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏ జిల్లాకు ఏంచేయాలో వైఎస్ఆర్కు తెలుసని, అందుకే 12 ప్రాజెక్టులు పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పారు. తన తొమ్మిదేళ్ల పాలనను తీసుకొస్తానని చెప్పి మళ్లీ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలడా అని ఆమె ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు కొత్త వాగ్ధానాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
గతంలో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ అంటే చంద్రబాబు అవహేళన చేసి మాట్లాడాడని, వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాజకీయాల్లో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబేనని తెహల్కా ఆనాడే చెప్పిందని గుర్తు చేశారు. ఇంటికో ఉద్యోగం చొప్పున మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు చెబుతున్నాడని, అయితే ప్రభుత్వంలో ఉన్నదే 20 లక్షల మంది ఉద్యోగులని, మరి ఇప్పుడు మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎక్కడినుంచి తెస్తాడని నిలదీశారు. గతంలో ఉద్యోగులు వద్దని కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబని, అలాంటిది ఇప్పుడాయన ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మొద్దని వైఎస్ విజయమ్మ తెలిపారు.
మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తావు బాబూ: వైఎస్ విజయమ్మ
Published Mon, Apr 21 2014 11:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement