బేణీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ | Sakshi
Sakshi News home page

బేణీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

Published Thu, May 1 2014 2:08 PM

బేణీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ - Sakshi

కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నాయని ఎన్నికల కమిషన్ మండిపడింది. కాన్పూర్ ర్యాలీలో నరేంద్రమోడీపై తీవ్ర అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అభిశంసించింది. షోకాజ్ నోటీసుకు బేణీ ప్రసాద్ వర్మ ఇచ్చిన సమాధానంతో ఏమాత్రం సంతృప్తి చెందని ఈసీ.. ఆయనను తప్పుచేశారని పేర్కొంది. ఎన్నికల కోడ్ను బేణీ ఉల్లంఘించారని ఈసీ చెప్పడం ఇది రెండోసారి.

ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో అతిపెద్ద గూండా మోడీయేనంటూ బేణీచేసిన వ్యాఖ్యలపై ఈసీ తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. 20 ఏళ్ల వయసులో ఓ తీవ్ర నేరం చేసి పారిపోయారంటూ మోడీపై ఆయన చేసిన వ్యాఖ్యలను అత్యంత అవమానకరమైనవని ఈసీ భావించింది. బలరాంపూర్లో ఇప్పటికే బేణీప్రసాద్ వర్మపై ఓ కేసు నమోదైంది.

Advertisement
Advertisement