మాచర్ల : పట్టణంలోని బస్టాండ్కు సమీపంలో ఉన్న కెనరాబ్యాంక్లో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఖాతాదారుడి జేబులోంచి రూ.14,500 నగదు చోరీ చేసిన సంఘటన గురువారం జరిగింది. మండలంలోని రాయవరం గ్రామానికి బీమా వెంకటేశ్వర్లు తన స్నేహితులతో కలసి కెనరాబ్యాంక్లో రూ.15వేలు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. టేబుల్పై వంగి డిపాజిట్ ఫారం నింపుతున్న సమయంలో చొక్కా పైజేబులో ఉంచుకున్న నగదును పక్కనే ఉన్న ఓ దుండగుడు కాజేశాడు. జేబులో నగదు లేకపోవడాన్ని గమనించి వెంకటేశ్వర్లు బ్యాంక్ మేనేజర్ పవన్కుమార్ వద్దకు వెళ్లి నగదు పోయిన సంగతి చెప్పగా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా సంచరించగా, అందులో ఒకరు టవల్ చేతికి అడ్డం పెటుకుని చోరీకి పాల్పడినట్టు గమనించారు. సంబంధిత విషయాన్ని పట్టణ పోలీసులకు తెలియజేయడంతో ఎస్ఐ జి.నారాయణ కూడా వచ్చి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దొంగతనం జరిగినట్టు నిర్ధారించారు. పది రోజుల కిందట ఇదే బ్యాంక్లో చోరీ జరిగింది. పదిహేను రోజుల కిందట ఆంధ్రాబ్యాంక్ వద్ద గుండ్లపాడుకు చెందిన మంగమ్మ అనే వృద్ధ మహిళ వద్ద నుంచి రూ. 27 వేలు పాతనోట్లు చోరీ చేశారు. మూడు చోరీ సంఘటనల్లో డిపాజిట్ చేయడానికి తీసుకువచ్చిన పాతనోట్లే చోరీకి గురికావడం గమనార్హం.
కెనరాబ్యాంకులో మళ్లీ చోరీ
Published Thu, Dec 1 2016 11:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement