సీరియల్‌ కిల్లర్‌ను ఉరి తీయాల్సిందే.. | Sakshi
Sakshi News home page

సీరియల్‌ కిల్లర్‌ను ఉరి తీయాల్సిందే..

Published Mon, Jan 16 2017 11:25 PM

serial killer hangging demand

మామిడికుదురు (పి.గన్నవరం) : 
మహిళలను మాయమాటలతో నమ్మించి వారిపై లైంగికదాడికి పాల్పడి అమానుషంగా హత్య చేసిన కపిలేశ్వరపురం మండలం కేదార్లంకకు చెందిన సీరియల్‌ కిల్లర్‌ సలాది లక్షీ్మనారాయణను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు మహిళలు సోమవారం రాస్తారోకో చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో తొలుత మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం నుంచి బస్టాండ్‌ కూడలి వరకూ వారు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడిన  నినాదాలు చేశారు. మహిళలను దారుణంగా హతమార్చిన నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మామిడికుదురు ఆల్‌ క్యాస్ట్‌ కాలనీకి చెందిన చేపూరి భాగ్యవతిని కిరాతంగా హత్య చేయడంతో ఆమె పిల్లలు అనాథలయ్యారని మహిళలు వాపోయారు.  ఈమేరకు నగరం పోలీస్‌ స్టేష¯ŒSలో రాజోలు సీఐ ఎం.క్రిస్టోఫర్, నగరం ఎస్సై జి.వెంకటేశ్వరరావులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా డివిజ¯ŒS కార్యదర్శి కందికట్ల గిరిజ, సీఐటీయూ నాయకుడు కందికట్ల రామారావు, పామర్తి వెంకటసత్యవతి, కె.అన్నపూర్ణ, నిమ్మన లక్ష్మి, కె.అన్నపూర్ణ, జి.సూర్యకాంతం, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement