చిన్నారులకు దుప్పట్ల పంపిణీ | Sakshi
Sakshi News home page

చిన్నారులకు దుప్పట్ల పంపిణీ

Published Wed, Jul 27 2016 12:57 AM

చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎస్పీ

మహబూబ్‌నగర్‌ క్రైం : జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గల కస్తూరిబాయి అనాథ ఆశ్రమంలో చిన్నారులకు మంగళవారం ఎస్పీ రెమారాజేశ్వరి దుప్పట్లు, మిఠాయిలు, కేక్, చాక్లెట్స్, పండ్లు పంపిణీ చేశారు. వారి క్షేమ సమాచారాలు, బాగోగులు గురించి ఆరాతీశారు. వసతిగృహా నిర్వహణ, చిన్నారుల భోజనం, ఆరోగ్య అంశాలపై నిర్వహణ దారులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేశారు. వివిధ హోటళ్లు, కిరాణ దుకాణాలలో పనిచేసి ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా వసతిగృహానికి తరలించిన చిన్నారుల కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణమూర్తి, రూరల్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు రాజేశ్వర్‌గౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement