Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి మృతి

Published Mon, Sep 26 2016 12:13 AM

in two different accidents two persons died

మునగాల
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన పిడమర్తి వెంకయ్య(21) వృత్తిరీత్యా లారీడ్రైవర్‌. ఈనెల 18న ద్విచక్రవాహనంపై స్వగ్రామం నుంచి మునగాల వస్తున్నాడు.  మార్గమధ్యలో బైక్‌ అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు.
మరో ప్రమాదంలో..
 నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామానికి చెందిన దేవరగట్ల లక్ష్మయ్య(50) మరో వ్యక్తితో కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి కోదాడవైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో మండలంలోని కృష్ణానగర్‌ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. లక్ష్మయ్యను అదేరోజు కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నగేష్‌ తెలిపారు.
 

Advertisement

What’s your opinion

Advertisement