‘ఎక్సైజ్‌’ సంఘ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వండి | Sakshi
Sakshi News home page

‘ఎక్సైజ్‌’ సంఘ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వండి

Published Sat, Aug 13 2016 8:31 PM

‘ఎక్సైజ్‌’ సంఘ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వండి

ఏలూరు అర్బన్‌ : జిల్లా అసోసియేషన్‌కు నూతన పాలకవర్గం ఎన్నుకునేందుకు అనుమతి ఇప్పించాలని కోరుతూ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ అడ్‌హాక్‌ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.అంద్రియ్య, కె.సుదర్శనరావులు తెలిపారు. శనివారం డెప్యూటీ కమిషనర్‌ వైబి.భాస్కరరావును కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఈ నెల 27న తాడేపల్లిగూడెం ఎక్సైజ్‌ కార్యాలయ ఆవరణలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇప్పించాలని డీసీని కోరారు.  
 
 

Advertisement
Advertisement