నిద్రపోతున్న భార్యకు ఉరివేసిన భర్త | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్న భార్యకు ఉరివేసిన భర్త

Published Fri, Mar 6 2020 8:35 AM

Harassing A Wife For Dowry In Karnataka  - Sakshi

మైసూరు: భార్యను కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో పాటు ఉరివేసి హత్య చేయాలని యత్నించిన భర్త ఉదంతం మైసూరు జిల్లాలోని హుణసూరు తాలుకాలోని సోమనాథపుర గ్రామంలో చోటు చెసుకుంది. నిందితుడు హుణసూరులో శిశు సంక్షేమ శాఖలో సహాయ అధికారి వెంకటప్ప.  బాధితురాలు నాగవేణి (41). ప్రస్తుతం మైసూరు నగరంలోని ప్రవేట్‌ అస్పత్రి పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంకటప్పకు నాగవేణికి 1997లో వివాహం జరిగింది.

అప్పటి నుంచి అన్యోన్యంగా ఉండగా, కొంతకాలంగా వెంకటప్ప కట్నం పేరుతో భార్యను ప్రతి రోజు వేధించడంతో పాటు కొట్టడం చేసేవాడు. ఈ నెల 3వ తేదీన రాత్రి భార్యతో గొడవ పడిన వెంకటప్ప ఎలాగైన సరే ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆమె నిద్రపోతున్న సమయంలో చీరతో గొంతు ఉరి బిగించాడు. ఆమె మేలుకుని కేకలు వేయడంతో  ఇరుగుపొరుగు వచ్చి నాగవేణిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జయపుర పోలీసులు బాధితురాలి వద్ద వాంగ్మూలం తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటప్పను పోలీసులు అరెస్టు చేశారు.  

Advertisement
Advertisement