వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం

Published Tue, May 14 2019 6:12 PM

YSRCP President YS Jagan Mohan Reddy Has Been Reached To Kadapa - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం కడప చేరుకున్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ సుమారు రాత్రి 7.30 గంటల సమయానికి ఇంటికి చేరారు. దారి పొడవునా ఆయనను కలిసేందుకు అభిమానులు బారులు తీరారు. రేపు, మర్నాడు వైఎస్‌ జగన్‌, పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. వారు చెప్పే సమస్యలను సావధానంగా విననున్నారు. రేపు సాయంత్రం పులివెందులలో ఇఫ్తార్‌ విందుకు హాజరు కానున్నారు.

Advertisement
Advertisement