సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సాలూరులో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం రాత్రిబస నుంచి పాదయాత్ర ప్రారంభమై సాలూరు నియోజకవర్గంలోని సాలూ రు వరకు సాగుతుందన్నారు. రామభద్రపురం రాత్రిబస నుంచి ఉదయం 7.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమై తారాపురం, మిర్తివలస క్రాస్, కొట్టక్కి క్రాస్, జిన్నివలస క్రాస్కు చేరుకుంటుందని తెలిపారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం సాలూరు చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం ముగుస్తుందనీ, అక్కడే జననేత రాత్రి బస చేస్తారని వివరించారు.
సభాస్థలి పరిశీలన: సాలూరు: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సాలూరులో సోమవారం నిర్వహిం చనున్న బహిరంగ సభ స్థలాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి,ప్రొగ్రా మ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం పరిశీ లించారు. పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్లో స్థలపరిశీలన చేసిన అనంతరం జగన్మోహన్రెడ్డి రాత్రి బసచేయనున్న ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ జరజాపు ఈశ్వరరావు, మున్సిపల్ వైస్చైర్మన్ కాకి పాండురంగ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ గిరి రఘు, పార్టీ జిల్లా కార్యదర్శి దండి శ్రీను, పార్టీ సీని యర్ నాయకుడు సూర్యనారాయణరాజు తదితరులున్నారు.