198వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

198వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Mon, Jun 25 2018 10:27 AM

YS Jagan Mohan Reddys Prajasankalpayatra Starts On 198th Day - Sakshi

సాక్షి, మామిడికుదురు: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత వైఎస్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభించారు. కైకాలపేట మీదుగా అప్పనపల్లి క్రాస్‌ చేరుకుని మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పాశర్లపూడి, పాశర్లపూడి బాడవ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం అక్కడే పాదయాత్ర ముగించి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం వరకు రాజన్న తనయుడు వైఎస్‌ జగన్‌ 2,414.2 కిలోమీటర్లు నడిచారు.
 

Advertisement
Advertisement