మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తా | Sakshi
Sakshi News home page

మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తా

Published Tue, May 15 2018 1:41 AM

Ys jagan mohan reddy tweet - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేందుకు మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలన్నదే తన సంకల్పమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

ఆయన ట్వీట్‌ ఇలా ఉంది.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరి ఆనందోత్సాహాల మధ్య 2004 మే 14న రాజన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలందరి ఉన్నతిని కాంక్షించే అద్భుతమైన సంక్షేమ పథకాలపైనే ఆయన దృష్టి పెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అదే నెల, తేదీ (మే 14) నా పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తవ్వడం చారిత్రక సంఘటన. రాజన్న రాజ్యంతో మళ్లీ యావత్‌ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తేవాలన్నదే నా లక్ష్యం.’’

Advertisement
Advertisement