వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన | Sakshi
Sakshi News home page

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన

Published Sat, Aug 17 2019 8:47 PM

Vijayawada Police Commissioner Visited Flood Effected Areas Krishna - Sakshi

సాక్షి, విజయవాడ:  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. కృష్ణలంక నుంచి తోట్లవల్లూరు వరకు వరద ప్రభావిత ప్రాంతాలను సీపీ స్వయంగా పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావంతో రోడ్లు జలమయమై సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు బోటులో వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు.

వరద పరిస్థితిని లంక గ్రామ వాసులకు వివరించి అందరూ పునరావాసాలకి తరలి రావాలని విజ్ఞప్తి చేసారు. అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించి ముంపు బాధితులకు అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకకున్నారు.

Advertisement
Advertisement