రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు

Published Tue, Sep 19 2017 9:00 AM

రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు - Sakshi

విజయవాడ: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో మర్తా శంకర్‌, మర్తా నరసింహరావులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని భవానీపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కంచికచర్లలో వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని పరిటాలలోని తమ  ఇళ్ళకు వెళ్తున్నారు.  వైఎస్సార్‌సీపీ నేతలు శంకర్, నర్సింహారావులపై  కక్ష కట్టిన టీడీపీ నాయకులు జెడ్పీటీసీ కోగంటి బాబు నేతృత్వంలో వారి ఇళ్లపైకి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో వారు  వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.  అర్ధరాత్రి సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద పెత్తున దాడికి దిగడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దాడి అనంతరం నిందితులు పరారయ్యారు. వెంటనే బాధితులను వైద్యం కోసం భవానీపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement