యూనివర్సిటీ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సినీనటుడు శివాజీ పేర్కొన్నారు. ఎస్వీయూ సెనేట్ హాల్లో మంగళవారం రాత్రి ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదికలో శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలపై మాట తప్పవద్దని, ఆంధ్రులను ముంచవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో పౌరసమాజం కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు, ఎన్జీవోలు ప్రభుత్వాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన వారిని ఎదిరించాలని పిలుపునిచ్చారు.
అడ్డగోలు విభజనతో రాయలసీమ, ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. యువత ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా రాకపోతే రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ మొదలైయ్యే అవకాశముందన్నారు. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదాపై ప్రశ్నించడం లేదన్నారు. మనమే ప్రశ్నించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ఎస్వీయూ ప్రొఫెసర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్లో కేవలం రెండు జిల్లాలు అభివృద్ధికి పరిమితం అవుతున్నాయని, దీని వల్ల రాబోయే రోజుల్లో మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పరిపాలన, అభివృద్ధి రాష్ట్రమంతా జరిగే చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎం నాయకులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతు నాయకుడు ఆదికేశవులురెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా పేరుతో బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు నవీన్కుమార్రెడ్డి, విద్యార్థి నాయకులు నగేష్, క్షేత్రపాల్, రాజశేఖర్రెడ్డి, సప్తగిరి ప్రసాద్, ఓబుల్రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
Published Wed, Mar 25 2015 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
Advertisement