స్మార్ట్ ఫోన్‌తో పంపుసెట్లు ఆన్: సీఎం | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్‌తో పంపుసెట్లు ఆన్: సీఎం

Published Tue, Apr 12 2016 1:40 AM

pump sets on with a smart phone: CM

టీడీపీలో చేరిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

 సాక్షి, విజయవాడ:  రైతులు స్మార్ట్ ఫోన్ ద్వారా పంపుసెట్ ఆన్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక ఏ కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

ముఖ్యమంత్రి నుంచి పిలుపు అందిన వెంటనే చేరకపోతే నష్టపోతాననే ఉద్దేశంతో టీడీపీలో చేరానని జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఇప్పటికి తాను మూడు రాజకీయ పార్టీలు మారానన్నారు. తిరిగి పుట్టింటికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

Advertisement
Advertisement