పింఛను సొమ్ము పెంచుతామన్నారు | Sakshi
Sakshi News home page

పింఛను సొమ్ము పెంచుతామన్నారు

Published Fri, Jul 6 2018 6:16 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి: ‘‘దివ్యాంగుడిని కావడంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. ప్రభుత్వం ఇస్తున్న రూ.వెయ్యి పింఛను ఏమాత్రం సరిపోవడం లేదన్నా’’ అంటూ జగన్నాయకులపాలేనికి చెందిన దివ్యాంగుడు యడ్ల చినబాబు జననేతకు వివరించాడు. ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసిన తన సమస్యలను వివరించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను సొమ్ము పెంచాలని కోరాడు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో చినబాబు ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement